CM KCR | రాష్ట్రంలో ఏ పథకం తెచ్చినా ఈ.. ఆ ఊరు తేడా లేకుండా.. చిల్లర రాజకీయ వివక్షలు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ప్రతి ఇంచు మనదే అని ఉద్విగ్నమైన భావనతో తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో రూపంగానే కనిపించేది మిషన్ భగీరథ. దీంతో ప్రతి ఇంటికి నీరు వస్తుంది. మిషన్ కాకతీయతో ప్రతి ఊరి చెరువు బాగుడుపతది. ఒకే నియోజకవర్గం, గిరిజన ప్రాంతాలైన ములుగు, భూపాలపల్లి జిల్లాలకు వెలుగులు రావాలని మెడికల్ కాలేజీలు మంజూరు చేశాం. ప్రతి జిల్లాకు వస్తే.. మారుమూల ప్రాంతాల్లోని వారికి మంచి అవకాశాలు వస్తాయి, బాగుంటుంది. గతంలో విపత్కర పరిస్థితులు చూశాం. కరోనా సమయంలో ప్రపంచమంతా గజగజ వణికిపోయింది. ప్రపంచాన్నే శాసించే స్థాయిలో ఉన్న అమెరికాలో లక్షాది మంది వైద్యసదుపాయాలు కొరవడి మృత్యువాతపడడం కళ్లారా చూశాం. మనం కూడా నష్టపోయాం’ అన్నారు.
‘రాబోయే రోజుల్లో అనేక రకాల వైరస్లు పట్టిపీడిస్తాయని కరోనా సమయంలో ఎంటమాలజిస్ట్లు చెప్పారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఏ రాష్ట్రంలో, దేశంలో వైద్య వ్యవస్థ పటిష్టంగా వాళ్లకు తక్కువ నష్టాలు సంభవిస్తాయ్. ఎక్కడ లోపభూయిష్టంగా ఉంటుందో ఎక్కువ నష్టాలు వచ్చి.. మానవ సంపద నష్టపోతదని ఎంటమాలజిస్ట్లు చెప్పారు. ఆర్థికవనరులు, అన్ని రకాల వనరులను పెంచుకుంటూ దేశానికే మార్గదర్శకంగా, అభ్యుదయపథంలో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి మహమ్మారులు, వైరస్ల బెడద రావొద్దని, మీరంతా విద్యావంతులై అద్భుతంగా ప్రజలను కాపాడి, విద్య పనికి రావాలని, ముందుకెళ్లాలన్నారు. వైద్య విధానం పటిష్టవంతమై ఎలాంటి వైరస్లు, కరోనాలాంటి మహమ్మారులు వచ్చినా అందరికీ రక్షణగా ఉండే గొప్ప వైద్య కవచాన్ని విద్యార్థుల రూపంలో చేసుకోవాలని బృహత్ ప్రయత్నానికి శ్రీకారం చుట్టాం. గొప్ప ఆశయంతో సామాజిక భద్రత, సమాజ శ్రేయస్సు, ముఖ్యంగా పేదల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వేలకోట్లు పెట్టుబడి పెడుతూ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మిస్తుంది’ అన్నారు.
‘భవిష్యత్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి, ఆరోగ్య పరిరక్షణకు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. ఏ సమస్యలు వచ్చినా మంత్రిని సంప్రదించి కళాశాలల్లో లోపం లేకుండా ముందుకు తీసుకెళ్లాలి. మనం తీసుకున్న పాలసీని దేశం అనుసరిస్తుంది. వైద్యరంగంలో తెలంగాణను అనుకరించే పద్ధతికి రాష్ట్రం ఎదగడం సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో బోధనా సిబ్బంది, కళాశాలల యాజమాన్యం పూర్తి తదేక దీక్షతో వైద్య విద్య కార్యక్రమాన్ని కొనసాగించాలి. విద్యార్థులు సంపాదించే జ్ఞానం తెలంగాణ ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడాలి. ఇంకా ఎన్ని వందల కోట్లానా వెచ్చిందేకు సిద్ధంగా ఉన్నాం.
ప్రజల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యత, ఇందుకు ఎంత ఖర్చయినా వెచ్చించేందుకు వెనుకాడం. పారామెడికల్ కాలేజీల్లో వెంటనే కోర్సులను ప్రారంభించాలని చూడాలని మంత్రిని కోరుతున్నా. అందరికీ అవకాశాలు వచ్చేలా పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. ఎలాంటి లోటుపాట్లు లేకుండా మంత్రి, సీనియర్ అధికారులు పర్యవేక్షించాలి. ప్రధాన కళాశాల భవనాలు నిర్మాణంలో వేగంగా పూర్తి చేయాలి. అందరూ సమన్వయంతో పని చేసి వైద్య, విద్యారంగంలో మంచి పేరును తెచ్చేలా ముందుకు వెళ్లాలి. భారతదేశంలో చరిత్రలో ఒక్క రాష్ట్రంలో, ఇంత తక్కువ సమయంలో ఒకే రోజు ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడం అరుదైన సందర్భం’ అని సీఎం పేర్కొన్నారు.