KCR | తెలంగాణ కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. ప్రజాతీర్పును ప్రతీ ఒక్కరూ గౌరవించి, ప్రజాసేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిద్దామని, ఏమి జరుగుతుందో వేచి చూద్దామని సూచించారు. రాజ్యాంగబద్దంగా జనవరి 16 వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉన్నా ప్రజాతీర్పునకు అనుగుణంగా హుందా వ్యవహరించి తప్పుకున్నట్లు తెలిపారు. తెలంగాణ భవన్లో త్వరలోనే సమావేశమై శాసనసభాపక్షనేతను ఎన్నుకుందామని చెప్పారు.
సీఎం కేసీఆర్ను కలిసివారిలో తన్నీరు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, దానం నాగేందర్, మర్రి రాజశేఖర్రెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, మాగంటి గోపీనాథ్, కొత్త ప్రభాకర్రెడ్డి, సుధీర్రెడ్డి, కాలే యాదయ్య, కేవీ వివేకానంద్, పాడి కౌశిక్రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, డాక్టర్ సంజయ్, సునీతా లక్ష్మారెడ్డి, లాస్య నందిత, చింతా ప్రభాకర్, ప్రకాశ్గౌడ్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా గజ్వెల్ నియోజకవర్గం నుంచి మూడోసారి విజయం సాధించిన బీఆర్ఎస్ అధినేతకు ఒంటేరు ప్రతాప్రెడ్డి నియామకపత్రాన్ని అందజేశారు.