హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, ప్రస్తుత పరిస్థితులపై ఈ సమీక్ష సమావేశంలో సీఎం చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల సీపీలు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేశ్ భగవత్లో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.