కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు ప్రథకంపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరుగుతున్న ఈ సమావేశానికి అధికారులు, మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్తో పాటు ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు హాజరయ్యారు. పథకం అమలుపై అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
హుజూరాబాద్లో నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. దీనికి సంబంధించి నిధుల కేటాయింపు కూడా జరిగింది. ప్రభుత్వం ఇప్పటికే రూ.2 వేల కోట్లు కలెక్టర్ ఖాతాలో జమచేసింది. ఈ నేపథ్యంలో దళితబంధుపై సీఎం కేసీఆర్ కరీంనగర్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తున్నారు.