CM KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. వసంత్ విహార్లో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం తుగ్లక్ రోడ్డులోని తన ఇంటికి కేసీఆర్ చేరుకున్నారు. ఓ గంట పాటు ఇంట్లోనే గడిపిన సీఎం కేసీఆర్.. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్టుకు బయల్దేరారు. అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ హైదరాబాద్కు బయల్దేరారు.
బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో గురువారం ఉదయం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి కేసీఆర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 1:05 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు కేసీఆర్. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.