న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ది రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్కు బయల్దేరారు. ధాన్యం సేకరణపై కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని తెంలగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ నిరసన దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. రైతుల సంక్షేమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను కేసీఆర్ ఎండగట్టారు. ఈ దీక్ష ముగిసిన అనంతరం సీఎం హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు.
ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశానికి మంత్రులందరూ హాజరు కానున్నారు. కేబినెట్ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు.