CM KCR | కాంగ్రెస్ పార్టీ మళ్లీ కౌలు రైతుల దుకాణం మొదలుపెట్టిందని.. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటోందని సీఎం కేసీఆర్ అన్నారు. జనగామ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మళ్లీ కొత్త వాళ్లు వస్తే ఇబ్బంది అవుతుంది. నేను చెప్పిందానిపై ఆలోచన చేయాలి. నేను ఏం చెప్పినా ధైర్యంగా చెబుతా. రైతుల భూములు, దానిపై హక్కులు రైతులకు ఉండాలని వాదించింది నేను. నేను మీకు ఒక అధికారం ఇచ్చాను. గతంలో వీఆర్వో ఒకటి రాస్తుండే. గిర్దావరి మరొకటి రాస్తుండే. నాయబ్ తహసీల్దార్ ఇంకోటి, ఎమ్మార్వో ఇంకోటి.. ఆర్డీవో ఇంకోటి.. జాయింట్ కలెక్టర్ కోర్టుకు వెళ్తే.. ఆయన ఒకటి రాస్తడు. దానిపై కలెక్టర్, దానిపై సీసీఎల్ఏ, దానిపై రెవెన్యూ సెక్రెటరీ.. రెవెన్యూ మంత్రి.. ఇవన్నీ కోర్టులుంటుండే. ఇందులో ఎవరికి కోపం వచ్చినా కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్లు మళ్లీ రైతు మునిగిపోతుండే. నేను కూడా కాపోన్ని కాబట్టి.. నేను వ్యవసాయంలోనే పుట్టినోడిని కాబట్టి.. రైతుల తెలుసుకాబట్టి ఒక పని చేసిన పెట్టాను. గవర్నమెంట్ దగ్గర తహసీల్దార్లకు, కలెక్టర్లకు, ఆర్డీవోలకు, రెవెన్యూ మంత్రులకు ఉండే అధికారాన్ని తీసి మీ చేతుల్లో పెట్టాను.
ఇవాళ మీ భూమిని మార్చాలంటే ఎవరూ మార్చాలేరు. ధరణి తెచ్చిన విప్లవం ఇది. ధోరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఎంత సునాయాసంగా జరుగుతుంది. రైతు భూమిని ముట్టే హక్కు ఎవరికీ లేదు. నీ భూమిని మార్చాలంటే నీవే కర్త.. నువ్వే దర్తవు. నీ బొటనవేలు ముద్రతోనే మారుతుంది తప్ప.. తహసీల్దార్కు కాదు.. ముఖ్యమంత్రి కూడా అధికారం లేకుండా చేసిన. మీ భూమిపై అధికారాన్ని మీకే ఇచ్చాం. మళ్లీ ఇవాళ కాంగ్రెస్ నేతలు కౌలు రైతులు అని మాట్లాడుతున్నరు. కౌలు రైతులు అంటే ఇల్లు కిరాయికి ఇచ్చినట్టే పొలం కిరాయికి ఇచ్చినట్లే. బంజారాహిల్స్లోనూ బంగ్లాలు కూడా కౌలుకు ఇస్తరు కదా? ఇక్కడ కూడా కబ్జాదారు కాలమని చెప్పి.. బంజారాహిల్స్ బంగ్లాకు మాఫీ.. రైతులు అగ్గవకు దొరికిర్రు బిడ్డ.. రైతులను గోల్మాల్ చేసి.. తాకులాటలు పెట్టించి కోర్టుల చుట్టు తిప్పి నాశనం చేస్తున్నరు కాబట్టి నా ప్రాణం పోయినా సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు దాన్ని మారనియ్య అని చెప్పాను’ అన్నారు.
‘భూములపై మీ భూముల మీద మీకే హక్కులు ఉండవాలి. కాంగ్రెస్ మళ్లీ కౌలు రైతుల దుకాణం మొదలు పెట్టింది. మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది. ఇవాళ ఉన్న పీసీసీ ప్రెసిడెంట్, భట్టి విక్రమార్క ధరణిని తీసి బంగాళాఖాతం వేస్తమంటున్నరు. మళ్లీ తహసీల్దార్లు, గిర్దావర్లు, వీఆర్వోలు.. నా భూమి నీ మీద రాసి.. నా భూమి రాజేశ్వర్కు రాసి.. రాజేశ్వర్ది దయాకర్రావుకు రాసి తాకులాటలు పెట్టించి.. కోర్టుల చుట్టూ తిప్పితే చచ్చిపోతం. కాంగ్రెస్ను బంగాళాఖాతం వేయాలా? ధరణిని బంగాళాఖాతంలో వేయాలా? ఆలోచించాలి. ఓటు అవలోకగా వేయొద్దు. బాగా ఆలోచించి వేయాలి. బంగారు కత్తి అని మొడకోసుకుంటమా? కరెంటు గురించి వాళ్ల మనసులో మాట చెప్పారు. మూడు గంటలు ఇస్తే సరిపోతుందన్నరు. 24గంటలు రైతులకు కరెంటు ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో ఒకటే తెలంగాణ రాష్ట్రం. నిన్నగాక మొన్న కాంగ్రెస్ కర్నాటకలో గెలిచారు. అక్కడ పంటలు ఎండిపోతున్నయ్. రైతులు రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు. రైతులు, భూములు సేఫ్గా ఉండాలంటే.. ఖచ్చితంగా కాంగ్రెస్ను శిక్షించాలి, బుద్ధి చెప్పాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న దెబ్బ తగులుతుంది. ఉద్యమాలు చేయడం తప్ప.. ఏం చేయగలిగేది ఉండదు. మనకు కులం, మనం, జాతి లేదు. రైతు బీమా ఎలా కట్టామో.. ప్రభుత్వమే సంవత్సరానికి వేలకోట్లు కట్టి ఎవరూ చనిపోయినా వారంలో రూ.5లక్షలు ఖాతాల్లో జమయ్యేటల్లు చేస్తాం. ప్రభుత్వం వచ్చిన మూడునాలుగు నెలల్లో బీమా సెట్ అవుతుంది. సహజ మరణం సంభవించినా సాయం అందుతుంది’ అన్నారు.