వికారాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఘనస్వాగతం లభించింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇక్కడి ఎన్నేపల్లిలో ప్రభుత్వం నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ భవనానికి 2018లో ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రజలను ఉద్దేశించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఈ సభను దిగ్విజయం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో ఇక్కడకు చేరుకున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూడా కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తారు.