KCR Press Meet Live Updates | సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి చేస్తున్న అన్యాయంపై సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లో వెల్లడిస్తున్నారు. దేశానికి నరేంద్ర మోదీ ఎంత అన్యాయం చేస్తున్నారో ఇటీవల వచ్చిన కొన్ని పుస్తకాల గురించి సీఎం ఈసందర్భంగా ప్రస్తావించారు.
అస్సాం ముఖ్యమంత్రి ఇచ్చిన సమాధానం సరైన విధానంలో లేదు అని నేను ఖండించాను.
ఇందులో తప్పేముంది. ఆయన ఏం అడిగారు. ప్రూఫ్ అడిగారు. ఇది ప్రజాస్వామ్య దేశం.
ఏఐసీసీ ప్రెసిడెంట్ ఆయన.. ఎంపీ ఆయన. ఆయనకు అడిగే హక్కు ఉంది. కానీ.. అస్సాం ముఖ్యమంత్రి ఇచ్చే సమాధానం అలా ఉంటుందా?
ఎక్కడైనా ఎన్నికలు జరిగితే చాలు.. బార్డర్ వద్ద హడావుడి చేసినట్టు ప్రొజెక్ట్ చేస్తరు. దురదృష్టవశాత్తు రావత్ చనిపోతే కూడా ఆయనను ఉత్తరాఖండ్ ఎన్నికల్లో వాడుకున్నరు.
సర్జికల్ స్ట్రయిక్స్ను తమ పొలిటికల్ మైలేజ్ కోసం బీజేపీ వాడుకోవాలని చూస్తోంది.
బార్డర్ వద్ద ఏదైనా గొడవ జరిగితే.. ఏదైనా యుద్ధం జరిగితే అది ఆర్మీ వాళ్లు చేస్తరు. ఆ క్రెడిట్ జవాన్లకు పోవాలి కానీ.. ఇందులో బీజేపీ చేసిందేంటి.. బీజేపీ ఎందుకు క్రెడిట్ తీసుకుంటోంది.
తప్పకుండా దేశంలో రావాల్సిన పరివర్తన ఎట్టిపరిస్థితుల్లోనూ అహింసాయుతంగా ఉండాలి
శాంతియుతంగా ఉండాలి
ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి
ప్రజాశక్తిని కూడదీయాలి.. అంబేడ్కర్ గారు చెప్పిన మార్గంలో బోధించు.. సమీకరించు.. పోరాడు
మంచి పద్ధతిలో వారు చెప్పారు
మహాత్మాగాంధీ గారు అనేక సంవత్సరాలు అహింసా మార్గంలోనే పోరాటం చేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు
దేశ స్వాతంత్ర్య పోరాటంలో సుభాష్ చంద్రబోస్ మిలిటరీ పద్ధతిలో పాల్గొన్నారు
నేను కూడా మహాత్మాగాంధీ శిష్యుడినే. ఆయన అవలంభిస్తున్న అహింసా మార్గంలోనే దేశానికి స్వాతంత్ర్యం రావాలి.. కానీ.. ఒకవేళ అహింసా మార్గం ద్వారా రాకపోతే.. నేను గన్తో రెడీగా ఉంటా.. గన్తో స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తా అని సుభాష్ చంద్రబోస్ చెప్పారు
30 ఏళ్లు బాధపడ్డాం
దేశంలోని ప్రతి ఇంటికి పవర్ అందిస్తున్నారా లేదా అని ఆలోచించాలి
తెలంగాణ రాకముందు.. ఉమ్మడి ఏపీలో మనం 30 ఏళ్ల పాటు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం
ప్రస్తుతం దేశమంతా థర్మల్ పవర్ మీద ఆధారపడి ఉంది
నానో టెక్నాలజీ వస్తుంది. చిన్న బ్యాటరీ చాలు.. హైదరాబాద్ మొత్తానికి కరెంట్ ఇచ్చే టెక్నాలజీ రావొచ్చు
ఎటువంటి పవర్ వినియోగించినా అది క్లీన్ పవర్గా ఉండాలి. అందుకే.. రినవబుల్ ఎనర్జీని ఉపయోగించాలని విద్యుత్ నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణలో ఒకప్పుడు 10 మెగావాట్ల సోలార్ పవరే ఉండేది. ఇప్పుడు 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ను ఉత్పత్తి చేస్తున్నాం.
పవర్ సెక్టార్నే ప్రైవేటు వాళ్లకు అప్పగించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దాన్నే మేము ఖండిస్తున్నాం.
మా ఇంట్లోనే ఇద్దరికి కరోనా వచ్చింది
అటువంటి సమయంలో నేను వెళ్లి ప్రధానిని కలవడం కరెక్ట్ కాదనిపించింది
ప్రధాని దగ్గరికి వెళ్లి మూడు నాలుగు గంటలు ఆయనతో పబ్లిక్లో గడపడం అనేది ఆ సమయంలో కరెక్ట్ కాదు
ఇవాళ ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతిని కలిశాను
ఫ్రంట్ అంటూ ఏం లేదు.. ప్రజలే ఫ్రంట్
నేను భువనగిరి సభకు వెళ్లినప్పుడు మమతా బెనర్జీతో ఫోన్లో మాట్లాడా
ఉద్దవ్ ఠాక్రేతో కూడా మాట్లాడుతా
దేశంలోని చాలామంది నేతలతో మాట్లాడా.. భవిష్యత్తులోనూ మాట్లాడుతా
అందరి కోరిక అయితే దేశవ్యాప్తంగా పార్టీ పెడదం. కేసీఆర్కు దమ్ములేదా.. అధికారం లేదా.. తప్పకుండా అవసరం వస్తే పెడదాం
టీఆర్ఎస్ పుట్టిన నాడు ఏమన్నారు.. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు అనుకున్న నాడు తలకిందులు అయితది
కేసీఆర్ నీటిబొట్టు అన్నంత కాదు అన్నరు నిన్న.. మరి నీటిబొట్టు లాంటి కేసీఆర్ ను చూసి ఎందుకు భయపడుతున్నారు
ఇప్పుడు కూడా ఏం జరుగుతదో ఎవరికి తెలుసు.
నేను రైల్వే స్టేషన్లో చాయ్ అమ్ముకున్నా అని మోదీనే చెప్పారు కదా. ఆయన ప్రధాన మంత్రి కాలేదా
సినిమా నటులు ముఖ్యమంత్రులు కాలేదా
ఎంజీఆర్, ఎన్టీఆర్ ముఖ్యమంత్రులు అయ్యారు
ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ.. ఏదో ఒకటి మాత్రం జరుగుతుంది
బీజేపీని ఈ దేశం నుంచి తరిమికొట్టాలి. దాని కోసం అందరూ కలిసి రావాలి. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి.. మంచి జరగనప్పుడు దాన్ని ఖండించాలి. నేషనల్ ఎజెండాను సెట్ చేయాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. బీజేపీ అరాచక పాలనను పారద్రోలాలి. అది ముఖ్యం. ఎవరు ఎవరితో కలుస్తారు అనేది ఇప్పుడు ముఖ్యం కాదు.
తెలంగాణ కోసం నేను ఉద్యమం ప్రారంభించిన నాడు.. ప్రజలను కదిలించిన. నేను కఠోరమైన సమైక్య వాదిని అన్న చంద్రబాబు.. జై తెలంగాణ అనలేదా. సీపీఐ పార్టీ అనలేదా.. ఎన్నో పార్టీలు అన్నాయి. ఎందుకు జనం కదిలారు కాబట్టి. ఇప్పుడు కూడా కదలాల్సింది దేశ ప్రజలు.
దేశంలో ప్రబలమైన మార్పు జరగాలంటే.. కదలాల్సింది దేశప్రజలు. కదిలించాల్సింది కూడా దేశ ప్రజలనే.
గవర్నర్ల వ్యవస్థనే మంచిగ పనిచేస్తలేదని సర్కారియా కమిషన్ చెప్పింది
ఈ వ్యవస్థ ఇలా ఉండకూడదు. వీళ్లు చాలా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పింది
బీజేపీ ప్రభుత్వంలో గవర్నర్ల వ్యవస్థ మరింత దుర్వినియోగం అవుతోంది
ఉత్తరాఖండ్లో గవర్నమెంట్ను బర్తరఫ్ చేస్తే హైకోర్టు తీర్పు ఇచ్చింది అక్కడ.. కరెక్ట్ కాదని.
మళ్లీ రీస్టోర్ చేసింది ప్రభుత్వం
హిజాబ్ ఘటనపై దేశం మొత్తం మౌనం వహిస్తోంది. కర్ణాటకలో వచ్చిన హిజాబ్ వివాదం దేశం మొత్తం వస్తే దేశం పరిస్థితి ఏంది
ధర్మం పేరుతో విధ్వేష రాజకీయాలు చేయడం ఇవన్నీ ఆగిపోయాలి
ఈ దేశం బాగుపడొద్దా. మన పక్కనున్న చైనాలా ఈ దేశం బాగుపడాలి
దాని కోసం కొత్త రాజ్యాంగం రావాలి..
తెలంగాణ లాగా భారతదేశం కూడా మారడానికి, పరివర్తనం చెందడానికి కొత్త రాజ్యాంగం రావాలి
10లో 9 జిల్లాలు వెనుక బడిన జిల్లాలు అని ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో అప్పుడు రాశారు.
ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్ కమ్ లో తెలంగాణ ముందంజలో ఉంది.
పర్ క్యాపిటా పవర్ యూజ్లో తెలంగాణ ముందంజలో ఉంది
దేశంలోని క్లీన్ గ్రామాలు 10లో 7 తెలంగాణకే వచ్చాయి
ఇండియా మొత్తం తెలంగాణలా కావాలంటున్నా. దాని కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా.. వద్దా
అంబేడ్కర్ గారు చెప్పిన స్పిరిట్ నేడు ఇంప్లిమెంట్ అవుతుందా
ఇప్పటికీ దళితులు ఎందుకు ఆక్రోశిస్తున్నారు
గుజరాత్లో దళిత బిడ్డలు పెళ్లికి గుర్రంపై ఊరేగిస్తేనే కొడుతున్నారు
అది మార్చాలి అంటున్నా.. అందుకే రాజ్యాంగాన్ని మార్చాలంటున్నాం.. తప్పా
77 శాతం సంపద.. 10 శాతం మంది దగ్గర కాదు
అంతర్జాతీయ ట్రక్కు స్పీడ్.. 105 కిలోమీటర్లు
మన దేశంలో ట్రక్కు స్పీడ్ 48 నుంచి 55 కిలోమీటర్లు
మన దేశంలో కూడా హైవేలు రావాలి.. ఇన్ఫ్రాస్ట్రక్షర్ రావాలి అంటున్నా తప్పా
మన దేశంలో గూడ్స్ రైలు యావరేజ్ స్పీడ్ 57 కిలోమీటర్లు.. అంతర్జాతీయ యావరేజ్ 115 కిలోమీటర్లు
మనకు కూడా అటువంటి గూడ్స్ ట్రెయిన్స్ కావాలంటే కొత్త రాజ్యాంగం రావాలంటున్నా తప్పా..
అమెరికా కన్నా గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి వనరులు, వసతులు, యువత ఈ దేశంలో ఉంది
ఆ శక్తిని సమ్మిలితం చేసి అద్భుతమైన ప్రగతి వైపు ఈ భారతదేశాన్ని నడిపించేటువంటి రాజ్యాంగం కావాలంటున్నా తప్పా..
అన్నింటినీ అమ్మేస్తున్నరు అని చెప్పినం.. మీరు అమ్మేది నిజం కాదా..
రైళ్లు అమ్మేస్తున్నారు.. విమానాలను అమ్మేస్తున్నారు.. బ్యాంకులను అమ్మేస్తున్నరు.. ఎల్ఐసీని అమ్ముతున్నరు.. చివరకు విద్యుత్ను కూడా అమ్ముతున్నరు
పేరుకు సంస్కరణలు.. దాని ముసుగులో ప్రైవేటీకరణ చేయడం
విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ను ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ పెద్దలకు అప్పగించడమే
మీ నియతి ఏంటి.. కంప్లీట్ గా కార్పొరేట్ చేయడం.. అప్పుడు ఏం జరుగుతది.. ఇబ్బడి ముబ్బడిగా చార్జీలు పెరుగుతాయి
ఏ సబ్సిడీ ఇవ్వొద్దు అంటడు.. నేను ఫ్రీ పవర్ ఇచ్చుకుంటే నీకేం నొప్పి
లాండ్రీలకు, సెలూన్లకు, ఎస్సీ, ఎస్టీలకు. టెక్స్ టైల్కు సబ్సిడీలు ఇస్తున్నా.. ఇవన్నీ బంద్ చేయాలి అంటడు. అన్నింటికీ మీటర్లు పెట్టాలి.. సబ్సిడీలు బంద్ చేయి అంటున్నారు. ఫౌల్ట్రీకి కూడా బంద్ చేయాలి అంటున్నారు
విద్యుత్ సంస్కరణల పేరుతో మీరు చేసేది ఇదేనా. వాళ్లు పంపించిన లేటర్స్లో ఇదే ఉంది.
నేను సీనియర్ పొలిటికల్ లీడర్ను
నేను 8 ఏళ్లు వెయిట్ చేశాను
8 వ సంవత్సరం అంటే 80 శాతం మోదీకి ఇచ్చిన సమయం అయిపోయింది. ఇక 9, 10 వ సంవత్సరానికి ఏం ఉండదు.
కిషన్ రెడ్డి అనే మంత్రి నాకు మిత్రుడే.. ఆయనకు నాకు వ్యక్తిగతంగా ఏ గొడవ లేదు
బడ్జెట్ను నేను సరిగ్గా అర్థం చేసుకోలేదట.. సరిగ్గా అవగాహన చేసుకోలేదట
ఏది అబద్ధం అండి.. 34,900 కోట్లు ఎరువుల సబ్సిడీ తగ్గించింది అబద్ధమా.. ఆహార సబ్సిడీని 65 వేల కోట్లు తగ్గించింది అబద్ధమా.. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 25 వేల కోట్లు తగ్గించింది అబద్ధమా..
ఎరువుల సబ్సిడీలు తగ్గించింది అబద్ధమా. మాకు ఎందుకు అర్థం కాలేదు.. నీకు అర్థం కాలేదు.. మేము ఎందుకు అర్థం చేసుకోలేదు.
మేము బ్రహ్మాండంగా అర్థం చేసుకున్నాం. 40 కోట్ల జనాభా ఉన్న దళితులకు మీరు పెట్టింది 12,800 కోట్లు నిజం కాదా..
జుట్టుకు 300 వస్తయి. ఇదేనా ప్రగతి.. దానికి మామీద నిందలు వేసుడా.. మాకు అర్థం కాలేదని.
ఇది మంచిది కాదు. చర్చ చేద్దామా చెప్పు. మేము రెడీ.
సాధారణంగా 12 శాతం గ్రోత్ ఉంటే 6 ఏళ్లలో డబుల్ అవుతుంది దేశ ఎకానమీ
11 శాతం ఉంటే 7 ఏళ్లలో డబుల్ అవుతుంది
దానికి నరేంద్ర మోదీ, నిర్మలా సీతారామన్ చెప్పాల్సిన అవసరం లేదు
వడ్డీ వ్యాపారిని అడిగినా చెబుతడు
ఇది కఠోరమైన వాస్తవం
2025 వరకు 5 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లడానికి నరేంద్ర మోదీ అవసరం లేదు..
మీకు దమ్ముంటే.. మీకు దేశాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటే.. చైనాలా అభివృద్ధి చేయండి.. సింగపూర్లా అభివృద్ధి చేయండి. అది చేయండి కానీ.. 5 ట్రిలియన్ ఎకానమీ కాదు
ఇది నేను చెప్పడమే కాదు.. నేను చెప్పిన విషయాన్నే చిదంబరం గారు కూడా రాజ్యసభలో చెప్పారు
మావాళ్లు కూడా ఉన్నారు.
అన్నీ గోల్ మాల్ మాటలు చెప్పి.. అబద్ధాలు చెప్పి ఎవరిని వంచించాలని అనుకుంటున్నారు.
అందుకే వీళ్లను తరిమికొట్టకపోతే దేశమే నాశనం అయిపోతది
చర్చ పెట్టండి దీని మీద
గాలి మాటలు మాట్లాడటం కాదు
నేను ఇవన్నీ చెబుతున్నాను.. ఇవన్నీ ఉత్తవేనా
దేశం నాశనం అవుతోంది. నేను దుఃఖంతో చెబుతున్నాను
అన్ని రంగాల్లో సర్వనాశనం
అన్ని పిచ్చి అబద్ధాలు.. పచ్చి అబద్ధాలు
ఇక్కడ చెప్పడమే కాదు... విదేశాలకు వెళ్లి చెప్పడం
2025 వరకు 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తం అంటరు.
ఇంతకన్నా దిక్కుమాలిన దందా ఉంటదా
అది చంద్రయాన్ మీదికి పోయిన దాని తోటి సమానం అంటరు
మనం కూడా చంద్రయాన్ మీదికి పోయినట్టే అనుకోవాలి ఇక
ఆ పార్టీకి చెందిన ప్రతి వాళ్లు దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు
వీళ్లు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు
అఖిల భారత విద్యుత్ సంస్థల ఉద్యోగ సంఘాలన్నీ ఒక్కటై సమావేశాలు పెట్టాయి
మన దగ్గర మింట్ కాంపౌండ్ దగ్గర కూడా ఎలక్ట్రిసిటీ శాఖ వాళ్లు ధర్నాలు చేశారు
మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి.. ఇప్పటికే ఉత్పత్తి ఉన్నవాటిని పెట్టనీయకుండా చేసి వాళ్ల పార్టీకి చందాలు ఇచ్చేటోళ్లకు, పార్టీని సాదేటోళ్లకు వాళ్ల ఎన్నికలకు డబ్బులు ఇచ్చేటోళ్లకు వేల కోట్ల రూపాయలు దిగమింగి వాళ్లు పెట్టే సోలార్ విద్యుత్ను వీళ్లు కొనాలట ఇప్పుడు. అదే చట్టం. ఇదేనా విద్యుత్ సంస్కరణ.
మన తెలంగాణకు జలవిద్యుత్ శక్తి అందుబాటులో ఉన్నదే కృష్ణా నది మీద ఎక్కువగా. నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల. 2500 మెగా వాట్ల దాక ఉంటుంది. గోదావరి మీద తక్కువ ఉంది మనకు.
ఈ దిక్కుమాలిన చట్టంలో ఇంకా ఏం చెప్పారంటే..వాళ్ల బీజేపీ మిత్రులు పెట్టే 30 నుంచి 40 వేల మెగావాట్ల సోలార్ పవర్ మనం కొనాలట క్లీన్ ఎనర్జీ కింద. మనది క్లీన్ ఎనర్జీ అయినా మీ నాగార్జున సాగర్, శ్రీశైలం ద్వారా వచ్చే పవర్ ను బంద్ పెట్టి అయినా దీన్నికొనాలట. లేకపోతే ఫైన్ వేస్తరట. ఇదే చట్టం.
పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ గత డిసెంబర్లో పార్లమెంట్కు సమర్పించిన డాక్యుమెంట్ ఇది
40 వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న సంస్థలు ఉన్నాయి కానీ.. ప్రొడక్షన్ కానివ్వడం లేదు
దానికి కారణం ఏంటి.. ఈ దేశం అవలంభించే బ్యాడ్ పవర్ పాలసీ వల్ల
60 శాతం దేశంలో పవర్ కట్స్ ఉన్నాయి
24 గంటల కరెంట్ను తెలంగాణలో తప్ప ఎక్కడా ఇవ్వడం లేదు
మీ 8 ఏళ్ల పాలనలో ఏనాడైనా ఒక యూనిట్ను ఒక్క రూపాయి 10 పైసలకు ఇచ్చారా అని నా చేతులు జోడించి అడుగుతున్నా మోదీజీ
అన్నీ అబద్ధాలే.. ఇలా ఎన్ని విషయాల్లో చెబుతరు
నిన్న ఒక చాలెంజ్ చేశా.. ఎవరు మాట్లాడుతరో రండి.. బీజేపీ వాళ్లు అన్ని ప్రశ్నించా
4 లక్షల మెగావాట్ల పవర్ ఉంది దేశంలో...
దాన్ని వాడే తెలివితేటలు ఈ కేంద్ర ప్రభుత్వానికి లేవు.. బ్యాడ్ పవర్ పాలసీ లేవు అని చెప్పా
మిషన్ భగీరథ కార్యక్రమం కోసం కొన్ని పైసలు ఇస్తరని నేను మోదీని ఆహ్వానించా
సభలో ఆయన కూడా పచ్చి అబద్ధం చెప్పారు
మీకు కావాలంటే నేను వినిపిస్తా
గజ్వేల్ సభలో ఆయన మాట్లాడిన స్పీచ్ కూడా వినిపిస్తా
15 నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది ఆయనది
ఆయన ఏం చెప్పారంటే అంతకుముందు 11 రూపాయలకు కొన్నరు పవర్.. మేము ఒక్క రూపాయి 10 పైసలకే ఒక యూనిట్ ఇస్తున్నాం అని చెప్పారు
భారతదేశ చరిత్రలోనే ఏ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక్క రూపాయి 10 పైసలకు ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు
మేము ఇస్తున్నాం అని చెప్పారు. పెద్దమనిషి కదా ఏమంటం అని నేను ఓపిక పట్టిన
ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా నన్ను అడిగారు. కానీ.. మనం పిలిచినం కదా.. ఏమంటం అని నేను అప్పుడు ఏం అనలేదు.. అని చెప్పి ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోను కేసీఆర్ మీడియాకు వినిపించారు.
మొన్నటి బడ్జెట్లో కూడా పెట్టిర్రు..
ఇన్ని ఉన్న కూడా ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పాపం ఆయనకు చదువస్తదో రాదో తెలియదు..
కాగితం సదివితే అర్థం అవుతదో కాదో తెలియదు..
గరీబ్ గాడు పాపం.. నిజంగా ఆయన్ను చూస్తే జాలేస్తోంది.
ఆయన మాట్లాడకుండా వేరే వాళ్లతో మాట్లాడిస్తే బెటర్ నన్ను అడిగితే.. ఆ పార్టీ పరువు పోతుంది రోజు రోజుకి.
చాలా ఘోరం. గిన్ని ఆధారాలు ఉండి.. గింత జరిగి.. ఐదేండ్ల కోసం చెప్పినం.. ఒక్కరోజుకోసం చెప్పింది కాదు..
ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండి..మన రాష్ట్ర శాసనసభ తీర్మానం పాస్ చేసి పంపించి.. నేను ముఖ్యమంత్రిగా దాన్ని వ్యతిరేకిస్తూ రాసిన ఉత్తరాలు ఉండి .. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నదాన్ని కూడా పచ్చి అబద్దం అని చెబుతున్నరు..
దీని మీద కూడా బహిరంగ క్షమాపణ చెబుతా.. మీటర్లు పెట్టమన్నరా.. పెట్టమనందే జగన్ పెట్టిండా.. శ్రీకాకుళంలో పెట్టిర్రా
మనం పవర్ రిఫార్మ్స్ను ఇంప్లిమెంట్ చేయడం లేదని ఆపేయిస్తున్నారు. వాళ్లు మీద ఒత్తిడి చేయిస్తున్నారు.
ఇది రాజ్యాంగ ఉల్లంఘన.. ఒక చట్టం పాస్ కాకముందే చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయడం.. దేశ ప్రజలను మోసం చేయడం కిందికే వస్తుంది.
ఇవన్నీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి తెలియక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు
నేను నిన్నటి సభలో నేను నష్టపోయినా మంచిదే మేము మీటర్లు పెట్టం అని చెప్పా
5 ఏళ్లలో దీని వల్ల మనం రూ.25 వేల కోట్లు నష్టపోబోతున్నాం
నా ప్రాణం పోయినా మీటర్లు పెట్ట అని చెప్పా
తెలంగాణలో వ్యవసాయం స్థిరీకరణ జరగాలి అని చెప్పా
రైతులు ధనవంతులు కావాలి.. ఇప్పుడిప్పుడే బాగు పడుతున్నారు కాబట్టి నేను పెట్టా అని చెప్పా
మనకు అర్హత ప్రకారం.. ఎకానమీ సైజ్ ప్రకారం 0.5 శాతం ఎఫ్ఆర్బీఎం పరిమితి వస్తే.. రూ.5000 కోట్లకు పైనే వస్తాయి
వచ్చే 5 ఏళ్ల వరకు విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు ఈ ఫెసిలిటీ ఇస్తాం అని ప్రకటించారు.
కేంద్రం పంపించిన ముసాయిదా బిల్లు ఇది.. అందరి మెడ మీద వేలాడుతున్న కత్తి ఇది
రాజ్యాంగం ఉల్లంఘించి.. బిల్లు పాస్ కాకముందే.. ఎవరైతే ఈ రిఫార్మ్స్ చేస్తరో అడిషనల్గా 0.5 ఎఫ్ఆర్బీఎం ఇస్తామని కేంద్రం ప్రకటించింది.
5 ఏళ్లు ఇస్తామని ప్రకటించారు
పోయిన సంవత్సరం మనం తీసుకోలేదు.
ఏపీ ప్రభుత్వం తీసుకున్నది.
శ్రీకాకుళం జిల్లాలో 25 వేల వ్యవసాయ మీటర్లు పెట్టారు వాళ్లు
మిగిలిన వాటికి టెండర్లు పిలిచారు
ఒక మీటర్కు రూ.3500 ధర
రూ.737 కోట్లతో వాళ్లు టెండర్లను పిలిచారు.
అసెంబ్లీ తీర్మానం చేసి మేము పంపించాం
మొన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్లో క్లియర్గా వాళ్ల పాలసీ చెప్పారు
అడిషనల్ బారోయింగ్ లింక్డ్ టు పవర్ సెక్టార్ రిఫార్మ్స్
ఇది పార్లమెంట్లో వాళ్లు ప్రవేశపెట్టిందో.. ఇది కేసీఆర్ చెప్పే స్టోరీ కాదు
ఇంత డాక్యుమెంటరీ సాక్ష్యం ఉంది
శాసనసభ తీర్మానం ఉంది
కేంద్ర విద్యుత్ మంత్రి రాసిన లెటర్ ఉంది.. దానికి నేను రాసిన లెటర్ కూడా ఉంది
విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తామని చెబుతున్నారు. డ్రాఫ్ట్ బిల్లు కూడా రెడీ అయింది.
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు డ్రాఫ్ట్ బిల్లును కూడా పంపించారు
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ లెటర్స్ రాశారు
దానికి జవాబుగా నేను కూడా ప్రధాన మంత్రికి లెటర్ రాశాను.
నేనే కాదు ఇతర ముఖ్యమంత్రులు కూడా లెటర్ పంపించారు
దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి
నిన్న, మొన్న నేను జనగామ, యాదాద్రి జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్లు ప్రారంభించుకున్న సందర్భంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడాను.
అక్కడ సభలలో అన్ని విషయాలు అక్కడ మాట్లాడలేము. అది బహిరంగ సభ కాబట్టి కొన్ని విషయాలనే ప్రజలకు స్పష్టం చేశా.
కొన్ని విషయాలు ఏంటంటే.. నరేంద్ర మోదీ చెప్పేది ఒకటి.. చేసేది ఇంకొకటి.. అబద్ధాలు బాగా చెబుతున్నారు.. ఒకటి చెప్పి మరొకటి చేస్తున్నారు