CM KCR | మేడ్చల్ మల్కాజ్గిరి : మేడ్చల్ నియోజకవర్గ ప్రజల కష్టాలను అర్థం చేసుకునే మల్లారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాజకీయ అనుభవం కలిగిన, సింపుల్గా ఉండే మల్లారెడ్డికి బ్రహ్మాండమైన విజయాన్ని సమకూర్చండి. మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మనం చెప్పినం అంటే నూటికి నూరు శాతం చేసి తీరామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 93 లక్షల తెల్ల రేషన్ కార్డుల ఉన్నాయి. రైతుబీమా తరహాలో కేసీఆర్ బీమా అమలు చేస్తాం. ఎవరికి ఎటువంటి అపాయం కలిగిన ఈ బీమా అందుంతుంది. వ్యవసాయం అభివృద్ధి చెందింది. పంటలు పండిస్తున్నాం.. కాబట్టి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్దిదారుడికి సన్నబియ్యం సరఫరా చేయాలని నిర్ణయించాం. అన్నపూర్ణ స్కీం కింద సన్నబియ్యం ఇస్తాం. ఆసరా పెన్షన్లు కూడా పెంచుకుంటున్నాం. సౌభాగ్య లక్ష్మి కింద మహిళలకు రూ. 3 వేల గౌరవ భృతి అందిస్తాం. రైతుబంధు కూడా పెంచబోతున్నాం. అగ్రవర్ణాల్లోని పేదపిల్లల కోసం 119 నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాలలు నెలకొల్పుతాం. నగరంలో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణం చేసి అందిస్తాం. మల్లారెడ్డి మంచి మనిషి, భగవంతుడు ఆయనకు సంపద ఇచ్చాడు. నియోజకవర్గంలోని గ్రామాలను సొంత డబ్బులతో అభివృద్ధి చేశానని చెప్పారు. మల్లారెడ్డి లాంటి మనిషి ఉంటే నియోజకవర్గంలో ఉన్న 6 లక్షల మనషులను మోయగలుగుతారు. మల్లారెడ్ది చేసిన సేవను గుర్తించాలి. కష్టపడి పైకొచ్చాడు. కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి. మరోసారి ఘన విజయం చేకూర్చాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.