ఆసిఫాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రగతి నివేదన సభా వేదికపై తెలంగాణ గాయకుడు, ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ ఛైర్మన్ సాయిచంద్కు నివాళులు అర్పించారు. సభా వేదికపై ఏర్పాటు చేసిన సాయిచంద్ చిత్రపటానికి సీఎం పుష్పాంజలి ఘటించారు.
సాయిచంద్ బుధవారం అర్ధరాత్రి గుండెపోటుకు గురవడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన హఠాన్మరణం పాలయ్యారు. ఆయన భౌతిక కాయానికి గురువారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తయ్యాయి.