హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ప్రాంగణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. ప్లీనరీ సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, హరీశ్రావు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, గువ్వల బాలరాజు, బాల్క సుమన్తో పాటు పలువురు పాల్గొన్నారు.