CM KCR | నేడు తండాలు ధనలక్ష్మీ, ధాన్యలక్ష్మీతో కళకళలాడుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమం కోసం బయలుదేరిన నాడు.. 24 ఏళ్ల కిందట పిడికెడు మందితోని ప్రారంభం చేశాం. ఆ రోజు ఎవరికి కూడా విశ్వాసం లేదు. తెలంగాణ ఏర్పడితదంటే నమ్మేవాళ్లకూడా లేకుండిరి. మహబూబాబాద్కు చాలాసార్లు వచ్చాను. ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఎక్కడ చూసినా పంటలు లేక, కాలువల్లో చెట్లు మొలచి చాలాఘోరమైన పరిస్థితి ఉండేది. మనమంతా కలిసిపోరాడినం కాబట్టి కాంగ్రెస్ ఎన్నిసార్లు మోసం చేసినా.. పట్టువదలకుండా కొట్లాడినం కాబట్టి 14-15 సంవత్సరాల పోరాటం తర్వాత.. చివరకు నేను చావునోట్లో తలకాయపెట్టి ఆమరణ దీక్షకు పోతే అప్పుడు తెలంగాణ రాష్ట్రం దిగివచ్చింది’ అని గుర్తు చేశారు.
‘తెలంగాణ రాష్ట్రం వచ్చిందం కాబట్టి మహబూబాబాద్ జిల్లా అయ్యింది. లేకపోతే జన్మలో కాకపోతుండే. ఒక జిల్లానే కాదు.. మహబూబాబాద్ రూపురేఖలు మారిపోయాయి. అప్పటి మహబూబాబాద్కు పోలిక, పొంతన లేదు. నేను స్వయంగా వచ్చి కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీలని ప్రారంభించుకున్నాం. ఇది గిరిజన, మారుమూల ప్రాంతం. వెనుకబడిన ప్రాంతం కాబట్టి.. ఇక్కడ కలెక్టర్, ఎస్పీ, జిల్లా కేంద్రం ఉంటేనే.. వెలుతురు వస్తదని.. మా గిరిజన బిడ్డల మొఖాల్లో వెలుతురు వస్తదని పట్టుబట్టి జిల్లా చేయించిందే నేను. దాని ఫలితాలు కూడా మనకు కనిపిస్తున్నయ్. ఉద్యమంలో తిరుగుతుంటే మాకు నమ్మకం లేకుండే. శ్రీరాంసాగర్ నీళ్లు వస్తయా? ఈ కాలువలో నీరుపారంగా చూస్తుమా? అనే నమ్మకం లేకుండే’ అన్నారు.
‘సమైక్య రాష్ట్రంలో మన ఓట్లు తీసుకున్న తప్పా.. మన బాధలు చూడలే. వెన్నవరం కాలువ సరి చేయించి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకుంటే.. చెక్డ్యామ్లు.. ఆఖేరు, మునేరు వాగులపై కట్టుకుంటే నీటితో నిండాయి. నదులను చూస్తే కడుపునిండినట్లుగా ఉన్నది. బ్రహ్మండంగా నది పొడువుతా నీళ్లు కనిపిస్తున్నయ్. మహబూబాబాద్ తండాల్లో ఇవాళ ధనలక్ష్మీ, ధాన్యలక్ష్మి కళకళలాడుతున్నయ్. మా ఆడవిబిడ్డల మొఖాలన్నీ తెల్లగైతున్నయ్. ఎన్నికల్లో ఏం జరగాలి.. ప్రజలు గెలవాలి. ఏమార్చేటోళ్లు గెలవొద్దు. ప్రజలు గెలిస్తేనే లాభం జరుగుతుంది. కోరికలు నెరవేరుతాయి. పోయిన ఎన్నికల్లో శంకర్ నాయక్ను గెలిపించారు. దాని ఫలితమేంటో మీరు చూస్తున్నారు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారు. గతంలో వచ్చినప్పుడు పట్నం బాగుపడాలని రూ.50కోట్లు మంజూరు చేశాను. అవన్నీ పనులు జరుగబోతున్నయ్. పరిశ్రమలు రావాలని ఎమ్మెల్యే కోరారు. అన్ని రకాలుగా ఈ ప్రాంతం బాగుపడాలి.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి.. మాకు అన్ని రకాలుగా అభివృద్ధి ఉండాలి.. మీ అండదండలు ఉండాలని కోరారు’ అన్నారు.