CM KCR | హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): ఎల్బీ స్టేడియం లో 12న ఇఫ్తార్ విందు ( Iftar Party ) ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కార్యదర్శి భూపాల్రెడ్డిని ఆదేశించారు. యేటా నిర్వహించే ఇఫ్తార్కు సీఎం స్వయంగా వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు రంజాన్ శుభాకాంక్షలను తెలుపుతారు.
పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేస్తారు. ఇదిలా ఉండగా గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మంది నిరుపేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాక్ లు పంపిణీ చేయనున్నారు. ఒక్కో కమిటీకి 500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 815 మసీదు మేనేజింగ్ కమిటీలకు ఇప్పటికే గిఫ్ట్ ప్యాకెట్లను సరఫరా చేశారు.