హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతున్నది. శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశమైన సీఎం కేసీఆర్.. నేడు హోంమంత్రి అమిత్ షా, కేంద్ర జల్శక్తి మంత్రి షెకావత్ను కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు సమస్యల పరిష్కారానికి సంబంధించి మంత్రులకు వినతిపత్రం సమర్పించనున్నారు.
శుక్రవారం ప్రధాని మోదీని కలిసిన సీఎం కేసీఆర్.. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ప్రధానిని ఆహ్వానించారు. అదేవిధంగా కాకతీయ టెక్స్టైల్ పార్కుకు వెయ్యి కోట్లివ్వాలని, ప్రత్యేక గిరిజన వర్సిటీని నెలకొల్పాలని, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం ఏర్పాటు చేయాలని, కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు జవహర్ నవోదయ స్కూళ్లు మంజూరు చేయాలని, రెండు పారిశ్రామికవాడలను మంజూరుచేయాలని, పీఎంజీఎస్వై కింద అదనపు నిధులు ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ వినతి పత్రాలు సమర్పించారు.