న్యూఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతున్నది. పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో భేటీ అయ్యారు. అనంతరం విందుభేటీలో పలు అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు. జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తి, దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, కేంద్రం విధానాలపై చర్చలు జరిపారు.
అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీ నుంచి చండీగఢ్కు బయలుదేరారు. సాగుచట్టాలపై పోరులో అమరులైన రైతు కుటుంబాలను సీఎంలు పరామర్శించారు. ఈ సందర్భంగా చండీగఢ్లో రైతులు, సైనికుల కుటుంబాలకు చెక్కులను అందించనున్నారు. అలాగే 600 రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం సీఎం కేసీఆర్ అందించనున్నారు. కార్యక్రమంలో పాల్గొనున్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్సింగ్ మాన్ పాల్గొనున్నారు.