CM KCR | ఎన్నికలు రాంగనే ఆగం కావొద్దు.. ఎవరో చెప్పారని ఓటు వేయొద్దు సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జనగామలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘ఎలక్షన్లు చాలా సందర్భాల్లో వస్తాయి. ఎన్నికలు రాంగనే ఆగం కావొద్దు. పరేషన్ కావొద్దు. ఎవరో చెప్పారని ఓటు వేయవద్దు. మా బావమరిది చెప్పిండు. మా మ్యాన మామ చెప్పిండు.. మా అన్నగాడు చెప్పిండని ఓటు వేయొద్దు. ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది. మన రాష్ట్ర దశ, దిశను మారుస్తుంది. చాలా ముఖ్యమైన ఆయుధం. ప్రజాస్వామ్యంలో మన చేతిలో ఉండే బలమైన ఆయుధమే ఓటు. దాన్ని ఎటు వినియోగిస్తమో మన ఖర్మ అటే పోతది. ఎవరో చెప్పారని నమ్మితే చాలా ప్రమాదం ఉంటది. కొందరు ఆపద మొక్కులు మొక్కే వారుంటారు. ఐదేళ్లు ఎక్కడ కనిపించరు.. ఎన్నికలు మొపుగాంగనే వస్తరు.. ఇష్టం వచ్చినట్లు మాట్లడుతరు. నోటికి వచ్చినట్లు మాట్లడుతరు. మంచి, చెడు గుర్తించి.. మంచి వైపు వెళితే బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది’ అన్నారు.
‘సంతోషకరమైన వార్త నేను చెప్పేది ఏంటంటే.. మీకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తున్నాయ్. కాళేశ్వరానికి లింకైన మల్లన్న సాగర్ మీ నెత్తిమీద కుండలాగనే 50 టీఎంసీల ప్రాజెక్టు ఉంటది. టప్పాస్పల్లి రిజర్వాయర్కు దాన్ని లింక్ చేస్తున్నాం. ఏ పరిస్థితుల్లో కరువు వొచ్చినా జనగామకు కరువు అన్నది రాదు. కొన్ని కొన్ని రిపేర్లు, పంట కాలువలు కావాలని కోరారు. కాలువలన్నీ పూర్తి చేయిస్తాం. ఇప్పటికే ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఇంకా రెండు, మూడు లిఫ్టులు పెడితే జనగామలో అందరికీ నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ తెచ్చి మీకు అప్పగిస్తా. దేవాదుల తెలంగాణ గులాబీ జెండా ఎగురగానే చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మాయమాటలు చెప్పి మోసపోయే ప్రయత్నం చేశారు. కొంత మధ్యలో కాంగ్రెస్ చేసినా అసంపూర్తిగా ఉండే. నదిలో నీళ్లు పోతయి కాని.. దేవాదుల పంపులకు నీళ్లు అందయ్. దాన్ని గుర్తించి అక్కడ సమ్మక్క బ్యారేజీ కట్టుకున్నాం. ఆ బ్యారేజీలో 365 నీళ్లు నిలబడి ఉంటయ్. ఇది వరంగల్ జిల్లాకే అంకితం చేశాం. మే నెలలోనూ నీళ్లు అందుబాటులో ఉంటాయి. మంచి బంగారు, వజ్రపు తునకలాంటి వరంగల్ను చూడబోతున్నాం’ చెప్పారు.
‘రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉండేవో మీకు తెలుసు. కరెంటు లేదు. మంచినీళ్లు, సాగునీరు లేదు. యువకులు వలసవెళ్లి బతుకుతుండే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెల్వది. అంచనాలు ఎవరికీ లేవు. చీకట్లోకి బాణం కొట్టినటువంటి పరిస్థితి. చాలా మంది ఆర్థిక నిపుణులు, జీఆర్రెడ్డిలాంటి వారిని పిలిపించి మేధోమథనం చేసి దారి పట్టుకున్నాం. భగవంతుడి దయ వల్ల నిజాయితీ ఉంది కాబట్టి విజయవంతం అయ్యాం. తొమ్మిదేళ్ల కింద మన పరిస్థితి ఎట్ల ఉండే. ఆ నాడు మనం ఏడ్చినా ఎవరూ పట్టించుకోలేదు. ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోతే లంచాలు పెట్టే పరిస్థితి. మూడు నాలుగు రోజులకు వచ్చే వరకు పొలాలు ఉండుతుండే. ఇప్పుడు 24 గంటల కరెంటు ఉంటుంది. నాణ్యమైన కరెంటు వస్తుంది.
ఎక్కడా ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలుతలేవు. ఎన్ని మోటర్లు ఉన్నయ్.. ఐదు హెచ్పీ పెట్టినవా అని అడిగే కొడుకే లేడు. ఎందుకంటే తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలే. గ్రామాలు రైతుల పంటలు పండితే.. తింటే దంగుతయా? అని పెద్దలు అన్నరు. ఇప్పుడు పంటలు ఎంట్ల పండుతున్నయో చూస్తున్నరు. రెండు నెలలు కొనుగోలు చేసినా దంగుతలేవు. హెలికాప్టర్లో పోతుంటే గ్రామంలో, రోడ్లపై ఎండబోసిన లక్షల టన్నుల ధాన్యం కండ్లారా కనిపిస్తుంది. దాన్ని చూస్తే మనసు పులకిస్తుంది. తెలంగాణలో అమ్మవారి దయ లక్ష్మీదేవి తాండవం ఆడినట్లు పల్లెలన్నీ కళకళలాడుతున్నయ్. జరంతా మొఖం తెలివికి వచ్చినం. రైతులు ఇప్పుడిప్పుడే అప్పులు మాఫీ చేసుకొని.. వడ్లన్నీ ప్రభుత్వం కొనడంతో మొఖం తెలివి అయినం. ఒకమాదిరి అయినం’ అన్నారు.