హైదరాబాద్ : భారతీయుల్లో వ్యక్తిత్వ పటిమ చాలా బలంగా ఉన్నప్పటికీ, టీమ్గా ఫెయిలవుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం ప్రసంగించారు. ఇండియాలో మనకు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మన వ్యక్తిత్వ పటిమ చాలా బలమైనది. ప్రపంచంలోనే నాలుగో, ఐదో ర్యాంకులో ఉంటాం. వ్యక్తులుగా మనం చాలా గొప్పవాళ్లం. కానీ టీమ్గా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతున్నాం. లీకేజీ ఆఫ్ డైనమిజం కూడా చాలా ఎక్కువ. మనం ఆఫీసుకో, ఎక్కడికో వెళ్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా అంటే.. ఆ మాటను పట్టుకుని ఓ ఐదు నిమిషాలు ఆలోచిస్తాం. సాయంత్రం దాకా అదే మనసులో ఉంటుంది. అది మరిచిపోం.
25 శాతం ఇమిడియట్ పాస్ట్కు, మరో 25 శాతం ఫ్యూచర్ కు లీక్ అవుతూ వర్తమానంలో 50 శాతం లైవ్గా పని చేస్తుంటాం. దాంతో రావాల్సిన ప్రొడక్టివిటీ రాదు. క్వాలిటీ పోతుంది. అందుకే ఏం చేసినా రసించి చేయాలని పెద్దలు చెప్తుంటారు. భోజనం చేస్తే కూడా రసించి చేయాలని చెప్తారు. చిత్తశుద్ధి, వాక్శుద్ధి, సందర్భశుద్ధి, ఆ పట్టుదల, ఏకగ్రాత మీద చిత్తశుద్ధి ఉంటే సాధించకుండా ఏది ఉండదు. కచ్చితంగా విజయాలను అందుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.