హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్లో వర్షాలపై ఉన్నతాధికారులు, మంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాల నేపథ్యంలో తీసుకున్న చర్యలను వివరించారు. కేంద్రంలోని బీజేపీ విధానాలపై మండిపడ్డారు. ఈ క్రమంలో విపక్షాలకు సవాల్ విసిరారు. రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్కు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా? అంటూ సవాల్ విసిరారు. తేదీని ఖరారు చేస్తే అసెంబ్లీని రద్దు చేసి ముందుకెళ్దాం అని వ్యాఖ్యానించారు.