హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల ముందు పదేపదే తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకుని అభాసుపాలవుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మరోమారు నవ్వులపాలయ్యారు. ములుగు జిల్లాలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే గిరిజనుల రిజర్వేషన్ను 10 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు విన్న పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. 6 శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్ను సీఎం కేసీఆర్ 10 శాతానికి పెంచారు. నిరుడు సెప్టెంబరు నుంచే ఇది అమలవుతున్నది. ఈ విషయం కిషన్రెడ్డికి తెలియకపోవడం, అధికారంలోకి వస్తే 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కిషన్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా గిరిజన రిజర్వేషన్ల పెంపుకోసం కృషి చేయాలని, ఇందుకోసం బీజేపీ పెద్దలను ఒప్పించాలని గిరిజన నేతలు కోరుతున్నారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న ఫైల్కు మోక్షం కల్పించాలని సూచిస్తున్నారు. మాట్లాడేముందు అన్ని తెలుసుకొని మాట్లాడాలని చురకలేస్తున్నారు.