హైదరాబాద్: భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు చిత్రపటాన్ని శుక్రవారం అసెంబ్లీ లాబీలో సీఎం కే చంద్రశేఖర్రావు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు పీవీ కుటుంబసభ్యులు పాల్గొననున్నారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం శాసనసభలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నారు. శాసన మండలిలో పల్లెప్రగతి, పట్టణప్రగతి, స్టాంపు చట్టం సవరణ బిల్లుపై, శాసన సభలో సౌర-పవన విద్యుత్, పత్తి సేకరణపై చర్చజరగనుంది.