హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సం స్థ (మెప్మా) ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. ఈ రెండు సంస్థలకు చెందిన 4,356 మంది ఉద్యోగులు సంబురాలు జరుపుకొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మెప్మా ఆర్పీలు, ఖమ్మం వ్య వసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మార్కెట్ పాలకవర్గ సభ్యులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకా లు నిర్వహించారు. సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ఆయన క్యాంపు కా ర్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మంత్రికి సెర్ప్ ఉద్యోగులు స్వీట్లు పంచి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి ధన్యవాదాలు తెలిపారు. వారికి మిఠాయిలు పంచి కృతజ్ఞత లు చెప్పారు. కార్యక్రమంలో సెర్ప్ స్టేట్ యూనియన్ నాయకులు సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు గంగాధర్రెడ్డి, నర్సయ్య సుదర్శన్, మహేందర్రెడ్డి, సుభాష్, సురేఖ, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
సెర్ప్, మెప్మా ఉద్యోగులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు అసెంబ్లీలో శుభవార్తను చెప్పడంపై తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) నేతలు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. టీజీవో అధ్యక్షురాలు వీ మమత, ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు రవీందర్రావు, బీ వెంకటయ్య, అరుణ్కుమా ర్, సబిత, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణాయాదవ్, గోపీచంద్, మంజులాదేవి ముఖ్యమంత్రికి ప్ర త్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్కు వీవోఏల సంఘం ధన్యవాదాలు తెలిపింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును రాష్ట్ర వీవోఏల సంఘం అధ్యక్షురా లు మాధవి అసెంబ్లీలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
కీలక నిర్ణయాలు ప్రకటించిన సీఎం కేసీఆర్ను అ సెంబ్లీలో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి తదితరులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి, వీఆర్ఏలను ఇరిగేషన్ విభాగంలోకి తీసుకొంటామ ని శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. సెర్ప్, ఐకేపీ, మెప్మా ఉద్యోగుల కూ ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం.
– చాడ వెంకట్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తానని ప్రకటించినందుకు రాష్ట్ర మెప్మా ఉద్యోగుల సంక్షేమ సం ఘం తరపున సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఇందుకు కృషిచేసిన మంత్రులు కేటీఆర్, హరీశ్, శ్రీనివాస్గౌడ్కు కృతజ్ఞతలు.
– కృష్ణచైతన్య, తెలంగాణ మెప్మా ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు
సెర్ప్, మెప్మా ఉద్యోగులకు స్కేల్, డీఏతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవ డం, మధ్యాహ్న భోజనం కార్మికులకు వేతనా లు పెంచినందుకు సీఎం కేసీఆర్కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ధరణిలో లోపాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవాలి.
– టీ జీవన్రెడ్డి, ఏ నర్సిరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు