హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తరప్రదేశ్కు ప్రత్యేక విమానంలో బయల్దేరారు. ఉత్తరర్పదేశ్లోని ఇటావా జిల్లాలో ఉన్న ములాయం స్వ్రగామం సైఫయీకి మంగళవారం మధ్యాహ్నం సీఎం చేరుకొంటారు. ములాయం పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించనున్నారు. అనంతరం ములాయం అంత్యక్రియల్లో కేసీఆర్తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొంటారు.
ములాయం అంత్యక్రియలు ముగిసిన అనంతరం ఇవాళ సాయంత్రం కేసీఆర్ ఢిల్లీకి చేరుకుంటారు. మూడు, నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోని మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చుతూ తీర్మానం చేసిన తర్వాత తొలిసారి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ నాయకులతో కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉంది.
ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ త్రీవ ద్రిగ్భాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ సోషలిస్టు నాయకుడు రామ్మనోహర్ లోహియా, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు రాజ్నారాయణ్ వంటి గొప్ప నేతల స్ఫూర్తితో ములాయంసింగ్ యాదవ్ రాజకీయాల్లోకి వచ్చారని సీఎం పేర్కొన్నారు. ఉత్తరర్పదేశ్కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ములాయం తన జీవితాంతం నిరుపేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పనిచేశారని గుర్తుచేసుకొన్నారు. ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేశ్యాదవ్కు, వారి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.