CM KCR | 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో తలసరి విద్యుత్ వినియోగం 1255 యూనిట్లు ఉండడం సిగ్గుచేటని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో విద్యుత్ సంస్కరణలపై జరిగిన లఘు చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘24 గంటల రైతు వద్దకు వెళ్లి పలకరించే పని లేకుండా.. ఎన్ని హార్స్ పవర్ పెట్టుకున్నవ్? అడిగే పని లేకుండా తెలంగాణ రైతులకు పవర్ ఇస్తున్న మాట నిజంకాదా? టీఆర్ఎస్ గవర్నర్ మెంట్ వచ్చాక ఐదున్నర నెలల్లోనే అహోరాత్రాలు పని చేసి సమస్యను పరిష్కరించాం. ప్రభాకర్రావు జెన్కో, ట్రాన్స్కో చైర్మన్గా రెండోసారి పని చేయనని, వేరేవాళ్లను పెట్టాలని చెబితే.. పని చేశారు.. అనుభవం అవసరం అని చెప్పాం. ఎక్కడెక్కడో ఉన్న వెతికి వారిని తీసుకువచ్చి.. పదవీ విరమణ చేస్తున్న సమయంలో వదిలి పెట్టి వెళ్లొద్దని నేను పర్సనల్ రెక్వెస్ట్ చేశా.. వాళ్లను సర్వీసులో పెళ్లి ఇవాళ్టి వరకు విజయవంతంగా నడుపుతున్నాం.. ఎన్ని బాధలు.. కష్టాలు వచ్చినా.. అవసరమైతే కొన్ని సబ్సిడీలు, ఇతర ఖర్చులు తగ్గించుకుందాం. పరిశ్రమలు, ఐటీ జరగాలన్న.. పరిశ్రమలు రావాలన్నా, వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలన్నా.. రాష్ట్రాభివృద్ధి జరగాలన్నా.. మనకు వచ్చే పన్నులు పెరగ్గాలన్నా విద్యుత్ రంగం కీలకమైంది’ అన్నారు.
‘ఎట్టి పరిస్థితిలో దీన్ని నిర్లక్ష్యం చేయదగింది కాదు. కానీ, దీని వెంబడి ఒకటే రకంగా కేంద్రం వెంటపడుతోంది. మాకు చేత కాదు.. మేం చేయం. మాకు తెల్వది. మాకు దూరదృష్టి లేదు అన్నట్లుగా ఉన్నది కేంద్రం తీరు. ఒక్కటే ఉదాహారణ.. ప్రపంచం ఈజీగా అర్థం చేసుకుంటది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన సమయంలోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు తెలంగాణ తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 970 యూనిట్లు. అట్లనే జాతీయ విద్యుత్ తలసరి వినియోగం 957 యూనిట్లు. ఈ రోజు ఎనిమిదేళ్లు అక్కడ కేంద్రం పరిపాలించింది. ఇక్కడ టీఆర్ఎస్ పరిపాలించింది. ఇప్పుడు తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 2126 యూనిట్లు. పెరిగింది 1156 యూనిట్లు పెంచాం.. ఇది మా లెక్క కాదు. కేంద్రం ఎలక్ట్రిసిటీ అథారిటీ చెప్పిందే. ఘనత వహించిన మోదీ.. ఇప్పుడు రఘునందర్రావు పొగిడిన ప్రజల కోసం, దేశం కోసం, దేశాభివృద్ధి కోసం పని చేసినటువంటి కేంద్రం పెంచింది ఇప్పటికి పెంచింది తెలంగాణను కలుపుకొని 1255 యూనిట్లు. కేంద్రం ఎనిమిదేళ్లలో పెంచింది 298 యూనిట్లు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో తలసరి విద్యుత్ వినియోగం 1255 యూనిట్లు ఉండడం సిగ్గుచేటు, బాధాకరం’ అన్నారు.
‘ఐస్లాండ్ అనే చిన్న దేశం తలసరి విద్యుత్ వినియోగం 51,696 యూనిట్లు. అమెరికా పర్ క్యాపిటా.. పవర్ యూనిలైజేషన్ 12,154, జపాన్ 7150, చైనా 6312.. పక్కనున్న భూటాన్ 3126 యూనిట్ల పవర్ క్యాపిటా ఉన్నది. 140 దేశాలను సర్వే చేస్తే ప్రచురితస్తే 104. ఇది విశ్వగురు సాధించిన మహత్తర ఫలితం. అసలు మీటర్లు పెట్టే కథేంది? మీటర్లు పెడితే ఎస్పీడీసీఎల్ చైర్మన్ రఘుమారెడ్డితో మాట్లాడుతున్న సమయంలో దగ్గర దగ్గర 98లక్షల మంది కుటుంబాలకు దీని దెబ్బ తగులుతుంది. భట్టీ విక్రమార్క చెప్పినట్లు దళితులు, గిరిజనులు, రైతులు, ల్రాండీలు నడుపుకునే రజకులు, క్షౌర శాలలు నడుపుకునే నాయీ బ్రాహ్మణులు, టెక్స్టైల్, పౌల్ట్రీ పరిశ్రమలు, కుంటు పడుతున్న కొద్దిపాటి పరిశ్రమలకు కొద్దిపాటి సబ్సిడీతో కరెంటు ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం తీసుకువచ్చిన సంస్కరణలు యధాతథంగా అమలు చేస్తే.. తక్షణమే వీటన్నింటికి మీటర్లు పెట్టాలే. ఈ దేశంలో విద్యుత్ రంగంలో 20లక్షల మంది పని చేస్తున్నరు. వారందరి ఉద్యోగాలు పోతయ్.. డౌటే లేదు నేను చెప్పేది గ్యారెంటీ’ అని సీఎం కేసీఆర్ అన్నారు.