హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. నూతన సచివాలయానికి ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం’గా నామకరణం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు(జీవో 111) జారీచేశారు. తక్షణం ఈ పేరు అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిపాలనా సముదాయభవనమైన సెక్రటేరియట్కు భారత సామాజిక దార్శనికుడు మహామేధావి డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరిట నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శం. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దకాలన్న అంబేదర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నది. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్ణాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ కొనసాగిస్తున్న స్వయంపాలన.. రాష్ట్రం ఏర్పాటైన అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలవడం వెనక అంబేదర్ మహాశయుని ఆశయాలు ఇమిడి ఉన్నవి. అంబేదర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
‘అంబేదర్ మహానుభావుడు కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉన్నది. ఫెడరల్ స్ఫూర్తిని అమలు చేయడం ద్వారానే అన్ని వర్గాలకు సమాన హకులు, అవకాశాలు కల్పించబడుతాయనే ఆయన స్ఫూర్తి మమ్మ ల్ని నడిపిస్తున్నది. దేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంత వివక్ష లేకుండా అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడటమే నిజమైన భారతీయత. ఆనాడే నిజమైన భారతం ఆవిష్కృతమవుతుంది. అన్నిరంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం, అంబేదర్ మహాశయుని పేరును రాష్ట్ర సెక్రటేరియట్కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది’ అని సీఎం కేసీఆర్ చెప్పారు
‘భారత నూతన పార్లమెంటు భవనానికి కూడా అంబేదర్ పేరును పెట్టాలని ఏదో ఆషామాషీగా కోరుకొన్న ది కాదు. భారతదేశ గౌరవం మరింతగా ఇనుమడించాలంటే, భారత సామాజిక తాత్వికుడు రాజ్యాంగ నిర్మాత పేరును మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించుకొన్నాం. అందుకు సంబంధించిన తీర్మానాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది కూడా. ఇదే విషయమై నేను భారత ప్రధానికి త్వరలో స్వయంగా లెటర్ కూడా రాసి పంపుతాను. తెలంగాణ ప్రభుత్వం డిమాండును పరిగణనలోకి తీసుకొని నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంటు భవనానికి డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరును పెట్టాలని నేను మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
దేశంలో సమానత్వం కోసం పోరాడిన మహనీయుడి పేరును వందల కోట్లతో నిర్మించిన అత్యాధునిక సచివాలయానికి పెట్టడం తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. అంబేద్కర్ పేరు పెట్టడం యావత్ దేశానికే గర్వకారణం. దేశంలో సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు బాబాసాహెబ్. తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలిచింది.
-పువ్వాడ అజయ్, రవాణామంత్రి
స్వరాష్ట్రం ఆవిర్భవించిన అనతికాలంలోనే సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే. ఆయన కృషి వల్లే రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తున్నది. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ద్వారానే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమయ్యింది. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.
-మల్లారెడ్డి, కార్మిక మంత్రి
అంబేద్కర్పై ఉన్న గౌరవాన్ని సీఎం కేసీఆర్ మరోసారి సగర్వంగా చాటారు. రాష్ట్ర చరిత్రలో ఇదో గొప్ప నిర్ణయం. పార్లమెంట్కు కూడా అంబేద్కర్ పేరు పెడితే భారతదేశ ప్రతిష్ఠ, గౌరవం ప్రపంచవ్యాప్తంగా మరింత పెరుగుతుంది. ఈ విషయంలో కేంద్రం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం స్వీకరించాలి.
– కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ
తెలంగాణ ఆవిర్భవించిన ఎనిమిదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇక్కడ అమలవుతున్నాయి. దళిత, పేదవర్గాల పట్ల కేంద్రానికి ప్రేమ ఉంటే రాజకీయాలను పక్కనపెట్టి పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి. ఈ విషయంలో బీజేపీ వైఖరి స్పష్టం చేయాలి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్షాలను రాష్ట్ర పార్టీ నేతలు ఒప్పించాలి.
-కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
సీఎం కేసీఆర్ నిర్ణయం రాష్ర్టానికే కాదు, దేశానికే గర్వకారణం. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన విధంగా పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలి. దీనిపై కేంద్ర సర్కారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి.
-రంజిత్రెడ్డి, చేవెళ్ల ఎంపీ
సీఎం కేసీఆర్ నిర్ణయంపై అన్నివర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ మేధావికి ముఖ్యమంత్రి కేసీఆర్ అపూర్వ గౌరవం ఇచ్చారు. పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలి.
– వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ
సెక్రటేరియట్కు అంబేదర్ పేరు పెట్టాలని కేసీఆర్ అపూర్వ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం దేశచరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. భావితరాలకు గొప్ప స్ఫూర్తినిస్తుంది. మిగతా రాష్ట్రాలు ఇదే సంప్రదాయం పాటిస్తే బాగుంటుంది. నూతన పార్లమెంట్ భవనానికి కూడా బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలి.
-జగదీశ్రెడ్డి, విద్యుత్తు శాఖ మంత్రి
దేశచరిత్రలో రాజ్యాంగ నిర్మాతకు ఇంతటి గౌరవం ఎవ్వరూ ఇవ్వలేదు. దళితబాంధవుడు సీఎం కేసీఆర్. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం చరిత్రలో నిలిచిపోతుంది. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే నూతన పార్లమెంట్ భవనానికి ఆ మహనీయుడి పేరు పెట్టాలి.
– గ్యాదరి బాలమల్లు, టీఎస్ఐఐసీ చైర్మన్
కేసీఆర్ సాహసోపేత నిర్ణయం
చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించగలిగే వాళ్లకే చరిత్ర సృష్టికర్తల గొప్పతనాన్ని ఆవిషరించే సమర్థత ఉంటుం ది. జనరంజక పాలన అందించాలన్నా, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలన్నా అది ప్రజల నాడి పసిగట్టిన నాయకుడికే సాధ్యపడుతుంది. సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం రాజకీయవర్గాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నది.
-ఎల్.రమణ, ఎమ్మెల్సీ
సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతూ సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకొన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, ఆత్మగౌరవాన్ని కాంక్షించే సీఎం కేసీఆర్కు ఈ గొప్ప ఆలోచన రావడం హర్షణీయం. దళిత వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం తపన పడుతున్న ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.
-శంకర్,తెలంగాణ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు
సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకం. అంబేద్కర్ పేరుతో ఉండే నూతన సచివాలయాన్ని తెలంగాణ ఉద్యోగులు పవిత్రంగా భావిస్తారు.
– రాంసింగ్, తెలంగాణ సచివాలయం సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్
అంబేద్కర్ పేరు నూతన సచివాలయానికి పెట్టడం గొప్ప విషయం. భారత జాతి అభివృద్ధికి, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానుభావుడిని ప్రతిరోజూ అందరూ తలుచుకునేలా సీఎం కేసీఆర్ చేశారు.
– శ్యామ్సుందర్, తెలంగాణ సచివాలయ సంఘం ఉపాధ్యక్షుడు
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం చరిత్రాత్మకం. ఆంబేదర్ ఒక కులానికో, మతానికో పరిమితమైన వ్యక్తి కాదు. దేశంలోని 136 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రపంచ మేధావి. భవిష్యత్తు తరాలకు మార్గదర్శి. ఆ మహనీయుడి పేరును ప్రధాన పరిపాలన భవనానికి పేరు పెట్టడమంటే మనని మనం గౌరవించుకోవడమే. పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలి.
– గోసుల శ్రీనివాస్యాదవ్, గొల్లకురుమ హకుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు
నూతన సచివాలయానికి బీఆర్ ఆంబేదర్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయం. అంతటి గొప్ప నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– జాజుల శ్రీనివాస్గౌడ్, జాతీయ అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం చరిత్రాత్మకం. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఆవిర్భవించింది. స్వరాష్ట్రంలో నూతనంగా నిర్మించుకున్న సచిలవాయ భవనానికి ఆయన పేరు పెట్టడం ఆనందంగా ఉన్నది. అంబేద్కర్కు తెలంగాణ ఘన నివాళి. అంత గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– వీ ప్రకాశ్, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర నీటి వనరుల అభివృద్ధి కార్పొరేషన్
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ, ఇటు అభివృద్ధిలోనూ అంబేద్కర్ అడుగుజాడల్లో ముందుకుసాగుతున్నారు. సబ్బండవర్ణాల సంక్షేమానికి పాటుపడుతున్నారు. అంబేద్కర్ స్ఫూర్తిని భావితరాలకు అందించే విధంగా నూతన సచివాలయానికి ఆయన పేరు పెట్టారు. ముఖ్యమంత్రి నిర్ణయం చాలా గొప్పది. కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– డాక్టర్ కే వాసుదేవరెడ్డి, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్
ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత పక్షపాతి. అభివృద్ధి, సంక్షేమంలో పెద్దపీట వేస్తున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయానికి బీఆర్ అంబేదర్ పేరు పెట్టి మరోసారి చాటుకున్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని పెంచారు. గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు తెలంగాణ దళిత సమాజం పక్షాన నా ధన్యవాదాలు. కేంద్రంలోని బీజేపీ సైతం నూతన పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
– బండ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
కుల, మతాలు, పేద, ధనిక తారతమ్యాలు లేకుండా రాజ్యాంగం ద్వారా దేశంలో ప్రతి వ్యక్తికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను ప్రసాదించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. సార్వజనీన వ్యక్తి. అంతటి మహనీయుడి పేరును సచివాలయానికి పెట్టడం అభినందనీయం. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం చరిత్రాత్మకం. కేంద్రం కూడా పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలి.
– రాజలింగం, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఎస్సీ 57 ఉపకులాల ఐక్య వేదిక
భారత రాజ్యాంగ నిర్మాత, సమానత్వానికి, సౌభాతృత్వానికి చిహ్నంగా నిలిచిన అంబేద్కర్ పేరు సచివాలయానికి పెట్టడం గొప్ప విషయం. ఇది చారిత్రాత్మక, స్ఫూర్తివంతమైన నిర్ణయం. విద్యావంతుల పక్షాన.. సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్
సామాజిక చైతన్యం గల సమాజానికి ఇది స్ఫూర్తినివ్వడమే కాకుండా.. అందరిలో ఆత్మైస్థెర్యాన్ని పెంచుతుంది. తెలంగాణ తీసుకున్న నిర్ణయం దేశానికి, ఇతర రాష్ర్టాలకు ప్రేరణగా నిలుస్తుంది.
– మామిళ్ల రాజేందర్,రాయికంటి ప్రతాప్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు
ఆచరణ వాది.. దార్శనికుడు కేసీఆర్
దళితబంధు పథకం అమలుచేయడం,సచివాలయానికి అంబేద్కర్ నామకరణం చేయడం శుభసూచకం. పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేయడం అంటే భావజాలపరంగా కేసీఆర్ను మించిన దళితుడు లేడనడాన్ని నిరూపిస్తున్నాయి. ఆచరణవాది.. దార్శనిక నాయకుడు కాబట్టే.. కేసీఆర్ ఈ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
– జూలూరు గౌరీశంకర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్
సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన సీఎంకు తెలంగాణ అంబేద్కర్ సంఘం, మాల మహానాడు, మాదిగ జేఏసీ, గిరిజన శక్తి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, బీసీ జనసభ, బీసీ విద్యార్థి సమాఖ్య, ప్రజా సంఘాల జేఏసీ, ఓయూ జేఏసీ, ముస్లిం జేఏసీ సంఘాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానాన్ని ఆమోదించాయి.
రాష్ట్ర కొత్త సచివాలయ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయం. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న. సచివాలయంలో ముఖ్యమంత్రి నుంచి కిందిస్థాయి అధికారి వరకు అంబేద్కర్ సూచించిన మార్గంలో పయనిస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషిచేయాలని ఆకాంక్షిస్తున్న.
– భట్టి విక్రమార్క, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత
నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం దేశానికే ఆదర్శం. సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు భవనానికి సైతం అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానించడాన్ని స్వాగతిస్తున్న. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు పేరు పెట్టాలని కోరుతున్నాను.
-వీ హనుమంతరావు, కాంగ్రెస్ సీనియర్ నేత
రాష్ట్రంలో నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి సీఎం కేసీఆర్ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం హర్షణీయం. ఎదుటి వారిని అడగటమే కాదు స్వయంగా చేసి చూపించి కేంద్రంలోని బీజేపీకి సీఎం కేసీఆర్ ఒక సవాల్ విసిరారు. ఇప్పుడు బీజేపీ చిత్తశుద్ధి, నిజాయితీ ఏంటో తెలుస్తుంది. సీఎం కేసీఆర్కు దళిత సంఘాలు, జాతీయ దళిత సంఘాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్న.
– మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్
చట్ట సభలకు దిశానిర్దేశం చేసిన అంబేద్కర్ పేరును రాష్ట్ర సచివాలయానికి పెట్టడం సీఎం కేసీఆర్కు దళిత జాతి పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం. కేంద్రప్రభుత్వం కూడా నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి. సీఎం కేసీఆర్ అనేక విషయాల్లో దేశానికి మార్గదర్శిగా నిలిచారు.
– కాసర్ల నాగేందర్ రెడ్డి, అధ్యక్షుడు, టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా విభాగం
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం అభినందనీయం, హర్షణీయం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను అభినందిస్తున్నా. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పార్లమెంటు భవనానికి అంబేదర్ పేరు పెట్టి ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతున్నా.
– చాడ వెంకటరెడ్డిసీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు
కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. ప్రభుత్వ ప్రకటన దళితుల ఆత్మ గౌరవాన్ని ఇనుమడింపజేసింది. రాజ్యాంగ నిర్మాతకు దక్కిన అసలు సిసలైన గౌరవం ఇది. తెలంగాణలోని దళితులకు ఇస్తున్న సముచిత గౌరవానికి నిదర్శనం. దళిత జాతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న ప్రేమ, ఆదరాభిమానాలకు ఇది ప్రతీక. యావత్ దళితుల తరఫున కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– బట్టు దాసురావు, దళిత, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
అంబేదర్ సేవలను గుర్తించి తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్కు నా అభినందనలు. దళిత బహుజన వర్గాల పట్ల సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉన్నదనేది ఈ నిర్ణయంతో మరోసారి స్పష్టమైంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ దళిత, బహుజనుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి తన చిత్తశుద్ధిని చాటుకుంటున్నారు. ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే గొప్ప విషయం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా నూతనంగా నిర్మించిన భారత పార్లమెంటుకు అంబేదర్ భవన్ అనే పేరు పెట్టాలి.
– రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య
తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం శుభపరిణామం. అణగారిన వర్గాలకు అండగా సర్కార్ ఉందన్న సందేశాన్ని ఇవ్వడంలో సీఎం కేసీఆర్ నిర్ణయం ఒక మైలురాయి అవుతుంది. అంబేద్కర్ నాలెడ్జ్ సింబల్. ఆయన పేరు పరిపాలనలో అత్యంత కీలకమైన సచివాలయానికి పెట్టడం ముదావహం. నేను ఈ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాను.
– అడ్వకేట్ సతీశ్కుమార్, డైరెక్టర్, సెంటర్ ఫర్ దళిత్ రైట్స్, జైపూర్
దళితబంధుతో సీఎం కేసీఆర్ దళితులకు ఆసరాగా నిలిచారు. తాజాగా సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టడం శుభపరిణామం. ఇలాంటి నిర్ణయాలతో కేసీఆర్ దళితుల పాలిట దేవుడయ్యారు. కేంద్రం సైతం ఇదే తరహాలో పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలి.
– ఎట్టెం సదానంద్, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్
సచివాలయానికి అంబేద్కర్ పేరు ఖరారుచేయడం శుభ పరిణామం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే పార్లమెంట్, అసెంబ్లీ సహా దేశ పరిపాలన అంతా నడుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత నిర్ణయం తీసుకున్నారు. దేశరాజధానిలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్కూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రధానిని కోరుతున్నాం.
-సైదానాయక్, తెలంగాణ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం యావత్తు దేశ పౌరులంతా హర్షించదగిన విషయం. ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. అదే స్ఫూర్తితో సీఎం కేసీఆర్ సచివాలయానికి పేరు పెట్టడం గొప్ప నిర్ణయం. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నభూతో నభవిష్యత్. దేశానికే ఆదర్శమైన నిర్ణయం.
– కేతావత్ రామకృష్ణ, గ్లోబల్ బంజారా సొసైటీ ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర నూతన సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. దళితుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టి దళితుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మాలలందరి తరఫున సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఆవుల సుధీర్, జాతీయ మాలల ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు
తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం హర్షణీయం. సీఎం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సహా ప్రజలంతా హర్షిస్తున్నారు. కేసీఆర్కు ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటు కొత్త భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి.
– మేకపోతుల నరేందర్గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు