హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం దురదృష్టకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, నిందితులపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సికింద్రాబాద్లో చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్రెడ్డిని సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ పరామర్శించారు. ప్రభాకర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రభాకర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని అకడే ఉన్న మంత్రి హరీశ్రావును ఆదేశించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆందోళన చెందవద్దని ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సోమవారం నాటి ఎన్నికల సభలను ముగించుకొని హెలికాప్టర్లో సోమవారం సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్న సీఎం.. నేరుగా యశోద హాస్పిటల్కు వెళ్లాలని భావించారు. అయితే ప్రభాకర్రెడ్డికి ఆపరేషన్ జరుగుతున్నదని.. ఇంకా రెండు, మూడు గంటలు సమయం పడుతుందని సమాచారం అందటంతో రాత్రి 8 గంటల ప్రాంతంలో దవాఖానకు చేరుకుని ప్రభాకర్రెడ్డిని పరామర్శించారు. హాస్పిటల్కు భారీ సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలకు కూడా సీఎం ధైర్యం చెప్పారు. ఆయన వెంట మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితరులు ఉన్నారు.
ఘటనను తీవ్రంగా ఖండించిన మంత్రులు
ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని మంత్రులు, ఎంపీలు తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో దాడులు, హత్యాయత్నాలు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కొత్త ప్రభాకర్రెడ్డిపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. నిరాశలో కాంగ్రెస్ పార్టీ భౌతికదాడులకు దిగుతున్నదని మండిపడ్డారు. తమ నేతలను భౌతికంగా అంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. థర్డ్రేట్ క్రిమినల్ను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించినప్పుడే ఇలాంటి ఘటనలను ఊహించొచ్చు అని అన్నారు. ప్రజాస్వామ్యంలో హింస, దాడులకు తావులేదని తేల్చి చెప్పారు.
ఈ ఘటనపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఘటన విషయం తెలుసుకున్న మం త్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్యాదవ్, జగదీశ్వర్రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కేశవరావు, ఒంటేరు ప్రతాప్రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయికిరణ్యాదవ్ దవాఖానకు చేరుకొని కొత్త ప్రభాకర్రెడ్డిని పరామర్శించారు. ఘటనను ఖండించినవారిలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వీ శ్రీనివాస్గౌడ్, సబితాఇంద్రారెడ్డి, ఎంపీలు కే కేశవరావు, నామానాగేశ్వర్రావు, అసదుద్దీన్ ఒవైసీ, ప్రణాళికాసం ఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఆర్థిక సంఘం సభ్యుడు గోసుల శ్రీనివాస్యాదవ్, టీఎస్ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ దక్షిణాఫ్రికా ఎన్నారైశాఖ నాయకుడు నాగరాజు తదితరులు ఉన్నారు.
పర్యటనలో ఫోన్లో సీఎం కేసీఆర్ ఆరా
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం జరిగిందని సోమవారం కామారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉండగానే సీఎం కేసీఆర్కు తెలిసింది. వెంటనే మంత్రి హరీశ్రావుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించేలా సూచనలు జారీ చేశారు. హెలికాప్టర్ నుంచే ఫోన్లో మాట్లాడారు. హత్యాయత్నాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆసారం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును ఎదురోలేక భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడటం సిగ్గుచేటని అన్నారు. ఎన్నికల సమయంలో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు, బీఆర్ఎస్ నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఎవరు దాడులకు పాల్పడ్డా సహించేది లేదని స్పష్టం చేశారు.