CM KCR | జనగామ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. నాడు ఆంధ్రోళ్ల బూట్లు మోసుకుంటూ, చంద్రబాబుకు చెంచాగిరి చేసుకుంటూ ఉండి, ఇవాళ కేసీఆర్ను తిడుతున్నాడు.. ఇది మర్యాదానా..? అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
రాజేశ్వర్ రెడ్డి రందీ పడుతుండు. ఎవడో జనగాం వచ్చి వర్లిపోయిండట. కుక్కులు మస్తు మొరుగుతాయి. దాన్ని లెక్క పెడుతామా..? జనగాంలో మొరిగిపోయిన కుక్క ఏం చేసిందో తెలుసా. రైఫిల్ పట్టుకుని ఎవడ్రా తెలంగాణ ఉద్యమం చేసేదని కరీంనగర్ మీదకు పోయిండు. ఆ రోజు నుంచి ప్రజలు రైఫిల్ రెడ్డి అని పేరు పెట్టిండ్రు. వీళ్లు వచ్చి మాట్లాడుతాం అంటే కనీసం సిగ్గుండాలి అని కేసీఆర్ మండిపడ్డారు.
ఆంధ్రోళ్ల బూట్లు మోసుకుంటూ ఉండి, ఆ రోజు చంద్రబాబుకు చెంచాగిరి చేసుకుంటూ ఉండి.. ఆనాడు పేగులు తెగేదాకా కొట్లాడిన రాజేశ్వర్ రెడ్డిని, తెలంగాణ ఉద్యమకారులను, వాళ్లందరికి నాయకత్వం వహించి ఆమరణదీక్ష పట్టిన కేసీఆర్ను తిడుతుంటే ఇది మర్యాదానా..? ఇదే కాదు కేసీఆర్కు పిండం పెడుతా అంటడు. ఎవరికి పిండం పెట్టాల్నో మీరు నిర్ణయించాలి. ఇది మర్యాదానా..? ఇది రాజకీయం అంటారా..? ఇట్ల సభ పెట్టుకుని నీ పార్టీ పాలసీ చెప్పుకో. గెలిచేటోడు చేస్తడా.. ఈ పని, డిపాజిట్లు పోయి ఓడిపోతామని భయపడేటోడే ఈ మొరుగుడు మొరుగుతరు అంతే కదా. తిట్టాలంటే ఈ దేశంలో తిట్లు కరువు ఉన్నాయా..? మనకు తిట్టరాదా..? ఇయ్యాల మొదలు పెడితే రేపటి దాకా తిట్టొచ్చు. మనం ఆప ని చేస్తలేం. మన విషయం చెప్పుకుంటున్నాం. దయచేసి మీరందరూ ఆలోచించి ఓటేయాలని కేసీఆర్ పేర్కొన్నారు.