CM KCR | జనగాం : కాంగ్రెస్ పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కలు మస్తు మొరుగుతయ్.. దాన్ని లెక్క పెట్టొద్దు.. ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. జనగాం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ ఉద్యమంలో ఎవ్వడు లేడు. ఇవాళ వచ్చి మాట్లాడుతుండ్రు కాంగ్రెసోళ్లు. యెన్కటికి ఎవడో అన్నడట.. వంటలన్నీ మీరు వండి తయారు పెట్టుర్రి. యాలకు నేను వచ్చి వడ్డిస్తా అన్నడట. తెలంగాణ కోసం కొట్లాడింది ఎవడు..? ఉద్యమం మొదలుపెట్టింది ఎవడు..? ప్రాణాలకు తెగించి, పేగులు తెగేదాకా జై తెలంగాణ అని నినదించి తెలంగాణ సాధించినోడు ఎవడు.?సాధించిన తెలంగాణను దేశంలో నవంబర్ చేసింది ఎవడు..? 24 గంటల కరెంట్ తెచ్చినోడు ఎవడు..? ప్రతి ఇంటికి మంచినీరు తెచ్చినోడు ఎవడు..? పంటలకు సాగునీరు తెచ్చినోడు ఎవడు..? యాలకు ఇప్పుడొచ్చి వడ్డన చేస్తాం అంటారా..? సాయి సంసారి లచ్చి దొంగ అని లఫాంగా మాటలు మాట్లాడకుంటూ. కాకరకాయ తోకరకాయ మాటలు మాట్లాడుకుంటూ.. ఎవర్నీ గోల్ చేస్తరు నాకు అర్థం కాదు. మనం గీడ అంత పిచ్చి పోసిగాళ్లం ఉన్నామా..? అని కేసీఆర్ ప్రశ్నించారు.
రాజేశ్వర్ రెడ్డి రందీ పడుతుండు. ఎవడో జనగాం వచ్చి వర్లిపోయిండట. కుక్కులు మస్తు మొరుగుతాయి. దాన్ని లెక్క పెడుతామా..? జనగాంలో మొరిగిపోయిన కుక్క ఏం చేసిందో తెలుసా. రైఫిల్ పట్టుకుని ఎవడ్రా తెలంగాణ ఉద్యమం చేసేదని కరీంనగర్ మీదకు పోయిండు. ఆ రోజు నుంచి ప్రజలు రైఫిల్ రెడ్డి అని పేరు పెట్టిండ్రు. వీళ్లు వచ్చి మాట్లాడుతాం అంటే కనీసం సిగ్గుండాలి. ఆంధ్రోళ్ల బూట్లు మోసుకుంటూ ఉండి, ఆ రోజు చంద్రబాబుకు చెంచాగిరి చేసుకుంటూ ఉండి.. ఆనాడు పేగులు తెగేదాకా కొట్లాడిన రాజేశ్వర్ రెడ్డిని, తెలంగాణ ఉద్యమకారులను, వాళ్లందరికి నాయకత్వం వహించి ఆమరణదీక్ష పట్టిన కేసీఆర్ను తిడుతుంటే ఇది మర్యాదానా..? ఇదే కాదు కేసీఆర్కు పిండం పెడుతా అంటడు. ఎవరికి పిండం పెట్టాల్నో మీరు నిర్ణయించాలి. ఇది మర్యాదానా..? ఇది రాజకీయం అంటారా..? ఇట్ల సభ పెట్టుకుని నీ పార్టీ పాలసీ చెప్పుకో. గెలిచేటోడు చేస్తడా.. ఈ పని, డిపాజిట్లు పోయి ఓడిపోతామని భయపడేటోడే ఈ మొరుగుడు మొరుగుతరు అంతే కదా. తిట్టాలంటే ఈ దేశంలో తిట్లు కరువు ఉన్నాయా..? మనకు తిట్టరాదా..? ఇయ్యాల మొదలు పెడితే రేపటి దాకా తిట్టొచ్చు. మనం ఆప ని చేస్తలేం. మన విషయం చెప్పుకుంటున్నాం. దయచేసి మీరందరూ ఆలోచించి ఓటేయాలని కేసీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ హాయాంలో చెరువుల్లో నీళ్లు కనబడకపోయేది. చాలా భయంకరమైన పరిస్థితి. బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి పోతున్నాం.. కారు ఆపి మాట్లాడుతున్నాను. మొత్తం ముసులోళ్లు ఉన్నారు. యువకులు లేరా అని అడిగాను. 9 ఏండ్ల నుంచి కరువు.. బతుకపోయారు అని చెప్పారు. మూడు నాలుగు కిలోమీటర్ల నుంచి మంచినీళ్లు ఎడ్ల బండి మీద తెచ్చుకుంటున్నాం. ఏడేండ్ల నుంచి చెరువు ఎండిపోయింది. చుక్క నీరు లేదు. బతుకలేని పరిస్థితి ఉందని చెప్తే ఏడ్సిన.. నాకే దుఃఖం వచ్చింది. ఇదేం గోస తెలంగాణకు. కృష్ణా, గోదావరి జీవనదుల మధ్య ఉండి ఇంత అన్యాయానికి గురైతే ఏ జాతి అయినా ఊరుకుంటదా.? అని బచ్చన్నపేట చౌరస్తాలో ఏడ్సిన. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏండ్ల నుంచి బచ్చన్నపేట చెరువు నిండే ఉంటుంది అని కేసీఆర్ తెలిపారు.