CM KCR | మధిర : కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర.. అలాంటి పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మధిర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని లింగాల కమల్రాజ్కు మద్దతుగా ప్రసంగించారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉండే ఒకే ఒక్క ఆయుధం ఓటు. అది మీ తలరాతను రాస్తది. వచ్చే ఐదేండ్లకు ఈ రాష్ట్ర భవితవ్యాన్ని, మీ భవిష్యత్ను నిర్ణయిస్తది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఓటు వాడాలి. చెప్పుడు మాటలు వింటే మనం దెబ్బతింటాం. న్యాయం తక్కువ జరుగుతది. నష్టం ఎక్కువ జరుగుతది. ఈ విషయాలన్నీ చర్చించాలి అని కేసీఆర్ కోరారు.
కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర. నేను ఘంటాపథంగా చెప్పగలుగుతా ఈ విషయాన్ని. కాంగ్రెస్ పాలనలో ఏం ఉండే. ఈ పదేండ్ల నుంచి ఏం జరుగుతుంది. దీన్ని బేరిజు వేయాలి. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో పేదలు, దళితుల బతుకు ఎలా ఉండే. రైతుల సమస్యలు ఎలా ఉండేనో ఆలోచించాలి. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బోడేపుడి వెంకటేశ్వర్ రావు మధిర ఎమ్మెల్యేగా ఉండే. వరి కంకులు తీసుకొచ్చి చూపించేవారు. మధిరకు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని నిరసన వ్యక్తం చేసేవారు. కాంగ్రెస్ హయాంలో అసెంబ్లీలో కందీళ్లు, కిరోసిన్ బుడ్లు కరెంట్ వస్తలేదని, ఎండిపోయిన వరి కంకులు పట్టుకుని రావడం. ఇదంతా మీరు చూశారు. కానీ పదేండ్లలో ఎక్కడ కూడా ఎకర పొలం ఎండలేదు. 24 గంటల కరెంట్ వస్తుంది. ఆయకట్టుకు నీళ్లు వస్తున్నాయి. రాష్ట్రమంతా వ్యవసాయం పండుగలా మారింది. ఈ విషయాలను ఆలోచించాలి అని కేసీఆర్ సూచించారు.
14 ఏండ్ల పోరాటం తర్వాత తెలంగాణ వస్తే ఆషామాషీగా పని చేయలేదు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేశాం. ఆర్థిక నిపుణులతో చర్చించి రాష్ట్రం యొక్క మంచి చెడ్డలు లోతుగా విచారించి కార్యక్రమాలకు రూపకల్పన చేశాం. ఈ స్వల్ప కాలంలో తెలంగాణ సాధించిన విజయాలు ఏందంటే.. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా వెనక్కి పోయిందా..? ముందుకు పోయిందా..? డెవలప్ అయిందా..? చెడిపోయిందా..? అని చూడటానికి కొన్ని గీటురాళ్లు ఉంటాయి. అందులో ప్రధానమైనది రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం చూస్తరు. తలసరి ఆదాయంలో 2014లో మన ర్యాంకు 18 ఉండే. ఇవాళ తెలంగాణ ర్యాంకు తలసరి ఆదాయంలో నంబర్ వన్గా ఉంది. ఇది మేం ప్రకటించం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రంలో మనకు వ్యతిరేక ప్రభుత్వం ఉంది. అయినా కూడా నంబర్ వన్ ఉందని వారే ప్రకటించారు అని కేసీఆర్ తెలిపారు.
ధాన్యం ఉత్పత్తిలో పంజాన్ను మించిపోయాం. తెలంగాణకు వ్యవసాయం చేయడం రాదని అవహేళన చేశారు. ఎగతాళి చేశారు. మీరు జోన్నలే పండించుకోవాలి.. వడ్లు పండవు అని అన్నారు. అట్ల మాట్లాడిన ఆంధ్రా ఎక్కడుంది..? ఇవాళ తెలంగాణ ఎక్కడుంది..? మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతుంది. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 4 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యానికి పోతాం. మన దేశంలో ప్రతి ఇంటికి నల్లా పెట్టి.. కులం, మతం, బస్తీ, ఊరు అనే తేడా లేకుండా శుద్ధమైన మంచినీళ్లు సరఫరా చేసే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. తలసరి విద్యుత్ వినియోగంలో కూడా టాప్ ర్యాంకులో ఉన్నాం. ఇవన్నీ సాధించిన విజయాలు. ఇవి ఆషామాఫీగా రావు. మాయ చేస్తేనో, ఉపన్యాసం చెప్తేనో రావు. చాలా చిత్తశుద్ధితో, ఒళ్లు దగ్గర పెట్టుకుని కమిట్మెంట్తో పని చేస్తేనే వస్తాయి. ఊరికే సొల్లు పురాణాలు చెప్తే రావు అని కేసీఆర్ తెలిపారు.