హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ, జార్ఖండ్ పర్యటనను ముగించుకొని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నారు. ఫిబ్రవరి 28న కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన విషయం విదితమే. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్.. బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి, రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్తో పాటు పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
శుక్రవారం ఢిల్లీ నుంచి జార్ఖండ్కు వెళ్లిన కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. జార్ఖండ్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్.. బిర్సా ముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గల్వాన్లోయలో మరణించిన వీరజవాను కుందన్కుమార్ ఓఝా సతీమణి నమ్రత కుమారి, మరో వీరుడు గణేశ్ హన్సదా మాతృమూర్తి కప్రా హన్సదాలకు రూ.పది లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్ అందజేశారు. అనంతరం రాంచీ నుంచి హైదరాబాద్కు కేసీఆర్ చేరుకున్నారు.