CM KCR | మధిర : దళిత బిడ్డలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు.. మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క మనకు చేసేది ఏం లేదు అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంచు అయినా కేసీఆర్దే. ప్రతి ఇంచు బాగు పడాల్సిందే అని స్పష్టం చేశారు. మధిర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని లింగాల కమల్ రాజ్కు మద్దతుగా ప్రసంగించారు.
మధిర చైతన్యంవంతమైన ప్రాంతం.. మీరంతా ఆలోచించాలి. గతంలో మధిరలో బీఆర్ఎస్ పార్టీని రెండు సార్లు గెలిపించలేదు. అయినా మీ మీద అలగలేదు. ఎందుకంటే ఈ మధిర నాది. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంచు అయినా కేసీఆర్దే. ప్రతి ఇంచు బాగు పడాల్సిందే. ఎక్కడ ధాన్యం పెరిగినా, ఎక్కడ పది మంది ముఖాలు తెల్లవడ్డ నాకు గర్వమే కదా..? రాష్ట్ర నాయకత్వానికి ఉండాల్సిన సోయి కదా..? అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అట్ల అని పక్షపాతం వహించలేదు. దళితబంధు ద్వారా మీరు సత్యాన్ని గమనించాలి. రాష్ట్రమంతా అమలు చేస్తున్నాం. ఒక మండలంలో అన్ని కుటుంబాలకు ఇస్తే వచ్చే ఫలితం ఎలా ఉంటది అని చెప్పి ప్రయోగత్మకంగా నాలుగు మండలాలు తీసుకున్నాం. ఇక్కడ భట్టి విక్రమార్క ఉన్నడు. ఆయన కాంగ్రెస్ అని పక్షపాతం పట్టలేదు. చింతకాని నుంచి నాకు ఎవరూ దరఖాస్తు పెట్టలేదు. భట్టి నన్ను అడగలేదు. దాని కోసం ధర్నా చేయలేదు. నన్నెవరూ డిమాండ్ చేయుకున్నా నాకు నేను రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాలు తీసుకున్న. దాంట్లో చింతకాని ఒకటి. 400కు పైగా ఇండ్లు ఉంటే అందరికి ఈ కార్యక్రమం అమలు చేశాం. మధిరలో దళిత జనాభా ఎక్కువ. దళిత సమాజం, మేధావులు దళిత బిడ్డలు, అక్కాచెల్లెళ్లు ఈ విషయాన్ని దృష్టి పెట్టి ఆలోచన చేయాలి. 50 ఏండ్ల కాంగ్రెస్ పరిపాలనలో దళిత బంధు లాంటి ప్రోగ్రాం పెట్టి ఉంటే ఇంతకాలం దళితుల దరిద్రం ఇట్లనే ఉండేదా? దళిత సమాజం దోపిడికి గురైన సమాజం. తరతరాలుగా అణచివేయబడ్డ సమాజం. వెలివాడలలో నివసించిన సమాజం. వాళ్లు సాటి మనషులు కారా..? వాళ్లు పైకి రాకూడదా..? వాళ్లు మనలాగా తయారు కాకూడదా..? ఎంతకాలం దళితుల దరిద్రం ఉంటదో.. ఈ దేశం ముఖం మీద ఒక మచ్చనే ఉంటది తప్ప ఈ దేశానికి క్షేమం కాదు. అది పోవాలి అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఉత్తర భారతదేశంలో దళితుల మీద భయంకరమైన దాడులు. మోదీ రాష్ట్రంలో కూడా దాడులు. భయంకరమైన దాడులు మనం అసలు భరించలేం. అతి తీవ్రమైన వివక్ష. ఇది పోవాలి. తెలంగాణ దళిత బంధు భారతదేశ దళితజాతికి ఒక మార్గదర్శనం చేయాలని పెట్టుకున్నాం. ఒకటే రోజు అందరికీ ఇవ్వలేకపోయినా, కనీసం దఫదఫాలుగా అయినా సరే వారి పేదరికం పోవాలి. దళిత యువకులు, యువతుల్లో వజ్రాలు, రత్నాలు ఉన్నాయి. వాళ్లకు అవకాశం లేక ఉంటున్నారు. ఉట్టిగ పదిలక్షలు ఇచ్చి ఊరుకోవడం లేదు. దళితబంధులో మేం జేసింది ఏందంటే రిజర్వేషన్లు పెట్టినం. వైన్, బార్ షాపులు బాగా డబ్బులు సమకూర్చే వ్యాపారం. ఒక్క దళితుడికి అన్న ఉండేన ఈ రాష్ట్రంలో. రిజర్వేషన్లు పెట్టి 260 మందికి ఇచ్చాం. మెడికల్ షాపుల్లు, ఫర్టిలైజర్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టినం. ఎవ్వళ్లు ఇవన్నీ నాకు చెప్పలేదు. ఇవన్నీ నాకంతట నాకు పెట్టుకున్న ప్రోగ్రాం. చింతకాని మండలం ఇవాళ బాగుపడ్దది. మరి దళితబిడ్డలు మళ్లా కాంగ్రెస్కు ఎందుకు గుద్దాలి ఓటు. ఈ పట్టి లేని భట్టి విక్రమార్కకు ఓటేస్తే మీకు వచ్చేది ఏంది..? పట్టులేనటువంటి, పట్టించుకోనటువంటి భట్టి విక్రమార్క మనకు చేసేది ఏంది..? ఆయన నియోజకవర్గానికే ఆరు నెలలకు ఒకసారి వస్తడు. చుట్టపు చూపులా వచ్చే మనిషి. అంతే కదా..? నేను వాస్తవం చెబుతున్నా అని కేసీఆర్ పేర్కొన్నారు.