హైదరాబాద్ : రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్లో ఘనంగా జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టారు. అక్కాచెల్లెళ్లు కలిసి కేసీఆర్కు హారతి పట్టి, రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి ఆశీర్వదించారు. సీఎం మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు సోదరి అలేఖ్య రాఖీ కట్టింది. ఈ రాఖీ వేడుకల్లో సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ శైలిమ దంపతులు, తదితరులు పాల్గొన్నారు.
రాఖీ పండుగ సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి రాఖీ కట్టిన ఆయన సోదరీమణులు.#RakshaBandhan pic.twitter.com/CSw2PWCjAU
— Telangana CMO (@TelanganaCMO) August 12, 2022