మంచిర్యాల : నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బుధవారం చెన్నూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 130 మంది లబ్ధిదారులకు రూ. 40 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎంతో మంది కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఆసరగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్తో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణుకుంట్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బైక్ను ఢీ కొట్టిన కారు..ఎనిమిదేండ్ల బాలుడు మృతి
రాష్ట్రంలో భారీ ఎత్తున స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు
దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ పాదయాత్ర
దళితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
మానవత్వం చాటుకున్న ఎస్పీ రాహుల్ హెగ్డే
దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి