సిద్దిపేట : విదేశీ విద్య.. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు బాసటగా నిలుస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలో మంగళవారం క్లౌడ్ వింగ్ ఓవర్సీస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నతమైన చదువులకు వెళ్లేందుకు ఈ క్లౌడ్ వింగ్ ఓవర్సీస్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. విదేశాల్లో చదివే పిల్లలకు తోడ్పాటును అందించడంతో పాటు సీట్లు ఇప్పించే సంస్థగా.. జిల్లా వాసులు విదేశాల్లో చదువుకునేందుకు క్లౌడ్ వింగ్ ఓవర్సీస్ చక్కటి అవకాశంగా భావించి ముందుకు రావాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరామ్, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భూ వివాదం : సినీ నిర్మాత సి.కల్యాణ్పై కేసు నమోదు
తహసీల్దార్పై డీజిల్ పోసి హత్యాయత్నం
పల్లె ప్రగతి నిరంతరం కొనసాగాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
పల్లె ప్రగతితో ఊహించని మార్పు : మంత్రి సబిత
పల్లె ప్రగతిని పక్కాగా చేపట్టాలి : మంత్రి ఐకే రెడ్డి
వరంగల్ను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం : మంత్రి ఎర్రబెల్లి
హరితహారంతో ములుగుకు పూర్వవైభవం రావాలి