KGBV | రంగారెడ్డి : హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాల్సిందే.. రాజీ పడొద్దని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన కందుకూరులోని కేజీబీవీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన ఆత్మీయంగా పలుకరించారు. మీరు తింటున్న ఆహారం ఎలా ఉంది..? ఇంట్లో తిన్నట్టే ఉందా..? లేక నాణ్యత లోపించిందా..? అని అడిగారు.
అనంతరం రఘునందన్ మాట్లాడుతూ.. గురుకులాలకు సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యత కలిగిన సన్న బియ్యం అని చెప్పారు. అన్నం, కూరలు వండేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, మాడిపోకుండా చూడాలన్నారు. అన్నం వండే పాత్రలకు తగిన కళాయి పూత ఉంటే.. అన్నం మరింత రుచికరంగా ఉంటుందని సూచించారు. ఇక గణిత దినోత్సవం సందర్భంగా ముగ్గులు వేసిన విద్యార్థులను రఘునందన్ అభినందిచారు.