హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : డిజిటల్ లావాదేవీలు నానాటికీ పెరుగుతున్నా అదేస్థాయిలో కొందరు మోసాలకు తెగబడుతున్నారని సీఐడీ ఏడీజీ మహేశ్ భాగవత్ తెలిపారు. శుక్రవారం నగరంలో పేటీఎం అధికారుల సహకారంతో ‘ఫిన్టెక్ ఎకోసిస్టమ్ అండ్ ఫ్రాడ్ ప్రివెన్షన్’పై సీఐడీ అధికారుల కోసం నిర్వహించిన వర్క్షాప్లో మహేశ్ భాగవత్ మాట్లాడుతూ.. అమాయకులను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు వినూత్న మార్గాలను ఆశ్రయిస్తున్నారని తెలిపారు.
ఇన్వెస్టిగేషన్ అధికారులు మోసాలను గుర్తించి, నివారించాలని సూచించారు. ఇందుకు చెల్లింపు గేట్ వేలు, అగ్రిగేటర్ల పనితీరుపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో పేటీఎం సౌత్ రీజినల్ డైరెక్టర్ వీవీఆర్ మూర్తి, వైస్ ప్రెసిడెంట్ మోహనాజ్ పర్వీన్, లీగల్ కౌన్సిల్ జమాల్ సైత్, అసోసియేట్ ప్రెసిడెంట్ అజయ్కుమార్ స్వామి, సీఐడీ విభాగం ఎస్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.