హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీక్రోధి నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభం కలగాలని, ఆశలు, ఆకాంక్షలన్నీ నెరవేరాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని అభిలషించారు. మన సంస్కృతి, సంప్రదాయాలు చాటిచెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, మాజీ మంత్రి హరీశ్రావు తదితరులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.