హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం కేసీఆర్ సభానాయకుడిగా యావత్తు శాసనసభ పక్షాన స్పీకర్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
శాసనసభా ప్రాంగణంలోని స్పీకర్ చాంబర్లో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్కు పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. స్పీకర్తో బర్త్డే కేక్ కట్ చేయించారు. అనంతరం స్పీకర్ అసెంబ్లీ ప్రాంగణంలో గ్రీన్ చాలెంజ్లో భాగంగా మొక్కను నాటారు. ప్రజలందరూ తమ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. శుక్రవారం తన చిన్ననాటి మిత్రుడు మృతిచెందిన విషయం తెలుసుకొని పోచారం కంట తడిపెట్టారు.