వరంగల్చౌరస్తా, ఆగస్టు 8 : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా డాక్టర్ జేవీ వెంకటేశ్వర్లును నియమిస్తూ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ క్రిస్టియానా జెడ్ చోంగ్తు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
1998 నుంచి 2024 వరకు ఆయన ఆర్థోపెడిక్ విభాగాధిపతిగా వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో సేవలందించారు. 2024-25 మధ్యకాలంలో యాదాద్రి భువనగిరి జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్నారు.