హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : కేంద్రీయ విద్యాలయాల్లో(కేవీలు) ప్రిన్సిపాళ్ల కొరత కనిపిస్తున్నది. 25% స్కూళ్లకు రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు లేరు. జాతీయంగా 1,356 కేంద్రీయ విద్యాలయాల్లో కేవలం 1,012 పాఠశాలల్లో రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు లేదా గ్రేడ్-2 ప్రిన్సిపాళ్లు ఉన్నారు. మిగిలిన 344 కేవీలు ఇన్చార్జీలతోనే నడుస్తున్నాయి. ఈ వివరాలను కేంద్ర విద్యాశాఖ పార్లమెంట్కు వెల్లడించింది. 2015-16లో దేశవ్యాప్తంగా 1,142 కేవీలు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 1,356కు చేరింది. 214 పాఠశాలలు అదనంగా ఏర్పడ్డాయి.
ప్రిన్సిపాళ్లు లేకపోవడంతో ఒక్కరికే రెండు స్కూళ్ల బాధ్యతలు అప్పగిస్తున్నారు. 2025 నవంబర్లో 8,714 బోధన పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ అ య్యింది. దీంట్లో 161 ప్రిన్సిపాల్ పోస్టులున్నాయి. 2025 డిసెంబర్లో నూ 2,153 బోధన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీంట్లోనూ 157 ప్రి న్సిపాల్ పోస్టులున్నాయి. ప్రిన్సిపాల్, ఇ తర సిబ్బంది ఖాళీలు పేరుకుపోవడం తో కేవీల్లో విద్యాప్రమాణాలు దెబ్బతింటున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇన్చార్జి బాధ్యతలు, కాంట్రాక్ట్వారితో కేవీలు నడిపించాల్సి వస్తున్నది.