CM KCR | తెలంగాణ కొత్త సచివాలయాన్ని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం ప్రారంభించారు. కార్యాలయంలోని తన చాంబర్లో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ఆరు దస్త్రాలపై సీఎం సంతకాలు చేశారు. మొదట దళితబంధు పథకానికి సంబంధించిన దస్త్రంపై సంతకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు, సిబ్బంది, నేతలనుద్దేశించి ప్రసంగించారు.
01) దళితబంధు పథకం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన దస్త్రంపై సీఎం కేసీఆర్ కొత్త సచివాలయంలో తొలి సంతకం చేశారు. అయితే, ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హుజూరాబాద్ మినహా 118 నియోజకవర్గాల్లో అమలు చేయనున్నారు. నియోజకవర్గానికి 1100 లబ్ధిదారుల చొప్పున పథకాన్ని అమలు చేయనుండగా ఈ ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేశారు.
02) పోడుభూముల పట్టాల పంపిణీకి సంబంధించిన ఫైలుసై సీఎం రెండో సంతకం చేశారు. మే నెల నుంచి
జిల్లాలవారీగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. 1.35లక్షల మంది లబ్ధిదారులకు దాదాపు 3.9 లక్షల ఎకరాలకు సంబంధించి పోడు పట్టాలు అందచేయనున్నారు. ఈ క్రమంలో ఈ ఫైలు మీద సీఎం సంతకం చేశారు.
03 ) సీఎంఆర్ఎఫ్ నిధులు లబ్ధిదారులకు సంబంధించిన ఫైలు మూడో సంతకం చేశారు.
04) గర్భిణులకు పౌష్టికాహారం కోసం అందించే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్కు సంబంధించిన ఫైలు మీద సీఎం సంతకం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్’ ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. 6.84 లక్షల మంది గర్భిణులు లబ్ధి చేకూరనున్నది. ఇందుకు ప్రభుత్వం రూ.277కోట్లు వెచ్చించనున్నది.
5) రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు సంబంధించిన ఫైల్పై సీఎం సంతకం చేశారు. 40 విభాగాల్లో 5544 మంది కాంటాక్ట్ ఉద్యోగులకు లబ్ధి జరుగనున్నది.
6) పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన ఫైలు మీద సీఎం సంతకం చేశారు.