హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ)/హిమాయత్నగర్: రైతు నేస్తంగా ఉంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలన కొనసాగించారని, నేడు ప్రధాని మోదీ రైతు శత్రువుగా మరి దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆరోపించారు. ఛత్రపతి శివాజీ 394వ జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్లో హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఛత్రపతి ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ అనేక సంసరణలు తీసుకొచ్చారని వివరించారు.