హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : తిరుమల నడకదారిలో మరోసారి ఓ చిరుత కదలికలు ట్రాప్ కెమెరాలకు చికాయి. వెంటనే టీటీడీ.. అటవీఅధికారులను అప్రమత్తం చేశారు. భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. అవసరమైతే భక్తులతో పాటుగా భద్రతా సిబ్బందిని కూడా పంపించాలని భావిస్తున్నారు. మళ్లీ చాలా రోజుల తర్వాత చిరుత తిరుమల నడకదారిలో సంచరించడం కలకలంరేపుతున్నది. భక్తులు కూడా భయాందోళనలో ఉన్నారు.