హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ రాజ్లను పరిశీలించాలని, వాటి నిర్మాణ ప నులను, డిజైన్లను అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి విజ్ఞప్తి చేసింది. ఈ మే రకు రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రా హుల్ బొజ్జా ఇటీవల ఎన్డీఎస్ఏ చైర్మన్కు లేఖ రాశారు. గతేడాది అక్టోబర్లో మేడిగడ్డ బరాజ్లోని ఏడవ బ్లాక్లో 20వ నంబర్ పిల్లర్ కుంగుబాటుకు గురవడంతోపాటు మిగిలిన రెండు బరాజ్లలో పలుచోట్ల సీపేజీలు బయటపడ్డాయి.
దీంతో వాటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భా గంగానే ఎన్డీఎస్ఏకి లేఖను రాసింది. బ రాజ్లను సందర్శించి వాటి నిర్మాణ పనుల నాణ్యత, డిజైన్లపై అధ్యయనం చేయాలని, లోపాలను గుర్తించాలని ప్రభుత్వం కోరింది. బరాజ్ల పునరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యలను కూడా సిఫారసు చేయాలని ఎన్డీఎస్ఏకి విజ్ఞప్తి చేసింది.