హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి తన బానిస మనస్తత్వాన్ని బయటపెట్టుకొన్నారని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు ఒక ప్రకటనలో ఆరోపించారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన ఆహ్వానించడం దానిని రుజువు చేస్తున్నదని పేర్కొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్పై తెలంగాణ వ్యతిరేకి రేవంత్తోపాటు ఎంపీ కోమటిరెడ్డి నోరుపారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్ తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలుపుతూ ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారని, కాంగ్రెసు పార్టీ నాయకులు మాత్రం తెలంగాణ ద్రోహులైన రేవంత్, షర్మిలకు రెడ్కార్పెట్ పరుస్తూ బలపడాలని భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు.