హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్లో(Central budget) తెలంగాణకు మొండి చేయి చూపించారు. రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని.సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి(Chada Venkata Reddy)అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారు. అయినా తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించలేక పోయారన్నారు. గ్యాస్ ధరలు, నిత్యవసలదారులు విపరీతంగా పెరిగాయి. ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.
ఆంధ్ర, బిహార్ రాష్ట్రాలకు ప్యాకేజీ ఇస్తే హర్షించదగ్గ పరిణామం. కానీ, తెలంగాణకు ఎందుకు మొండి చేయి చూపించారని ప్రశ్నించారు. పెన్షన్లు, ఆదాయపన్ను స్లాబ్ రేట్లు తూతూ మంత్రంగా ప్రవేశపెట్టినా నిత్యవసర ధరలు పెరుగుపోయిన తరుణంలో వాటికి ఉపశమన మార్గాలు చేయలేదన్నారు. తెలంగాణకు ఒక సాగునీటి ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కూడా ఇవ్వలేదని, కనీసం నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారని చాడ హెచ్చరించారు.