హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం కేవలం మద్దతు ధరల ప్రకటనలకే పరిమితవుతున్నదని, ఆ ధరలకు పంటలను మాత్రం కొనుగోలు చేయడంలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర లేనప్పుడు కేంద్ర ప్రభుత్వమే మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రం పంటల కొనుగోళ్లకు మద్దతు ధరలు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి తుమ్మల స్పందిస్తూ తాము (కేంద్రం) ధరలు మాత్రమే ప్రకటిస్తాం.. పంటలు కొనుగోలు చేయబోము అంటే కుదరదని హెచ్చరించారు. మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.