హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే ప్రతిపాదనేదీ తమ వద్ద పెండింగ్లో లేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం మరోసారి స్పష్టంచేసింది. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఉమ్మడి నిర్ణయానికి రావాలని కేంద్ర న్యాయశాఖ ఇప్పటికే పేర్కొన్నది.
లోక్సభలో వైసీపీ ఎంపీ తలారి రంగయ్య అడిగిన ప్రశ్నకు న్యాయశాఖ ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి పూర్తిస్థాయి ప్రతిపాదన పంపితే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొన్నది.