‘తిప్పడు తిరుపతి కొండకుపోతే మెట్లు ఎక్కా.. దిగా..’ అన్నట్టుగా తయారైంది సీఐఎస్ఎఫ్ పరేడ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిస్థితి. పరేడ్ను తిలకించేందుకు హాజరయ్యే అతిథులు, మీడియా, ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటుచేశారు.
తనకు కేటాయించిన గ్యాలరీలోకి ఎలా వెళ్లాలో తెలియక గ్రౌండ్ మొత్తం కలియ తిరిగిన బండి సంజయ్.. చివరకు ప్రేక్షకుల గ్యాలరీ నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినని, ఎంపీనని చెప్పినా వారు అనుమతించలేదు. దీంతో తానే నడుచుకుంటూ అతిథుల గ్యాలరీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఉన్నతాధికారుల ద్వారా నిర్ధారించుకొని అనుమతించారు.
బండి, కిషన్.. ఇదీ వరుస!
అది సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ ముఖ్య నేత అమిత్షా ప్రసంగిస్తున్న వేదిక. తొలిసారిగా ఢిల్లీకి వెలుపల హైదరాబాద్లో నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్. సాధారణంగా అమిత్షా లాంటి ముఖ్య నేతలు ప్రసంగిస్తుంటే.. ఆ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉంటారు. కానీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం అమిత్షా ప్రసంగాన్ని పట్టించుకోకుండా ఇలా కునుకు తీసేశారు. ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఎప్పుడైనా ఇలా సభా వేదిక మీద కునుకుతీయడం చూశారా?