Krishna Tribunal | కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ గడువును కేంద్ర ప్రభుత్వం శనివారం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జల వివాద పరిష్కారం తీర్పు ఇంకా ఇవ్వాల్సి ఉన్నందున గడువును 2024, మార్చి 31 వరకు కేంద్రం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ ఏడాది ఆగస్ట్ ఒకటో తేదీ నాటికి ట్రిబ్యునల్ తీర్పు వెలువరించాల్సి ఉంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తీర్పునుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ గడువును పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.